Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా అసలు గుట్టు వీడింది.. రంగంలోకి సీనియర్ దర్శకుడు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల పర్వం మొదలైందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రభాస్, రాజమౌళి కారణంగా మన ఇండస్ట్రీ భలమేంటో ఇప్పటికే అందరికి అర్ధమైపోయింది. ఇక నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న మరిన్ని సినిమాలు కూడా అంతకు మించి అనేలా ఆడియెన్స్ ని ఆకట్టుకోబోతున్నట్లు చెప్పవచ్చు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ప్రభాడ్ సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్ లో ఉన్నాయి.
ఇక ఇటీవల చిత్ర యూనిట్ ఇచ్చిన మరో ఎనౌన్స్మెంట్ తో సినిమాపై ఉన్న అంచనాల డోస్ మరింత పెరిగాయి. ఎందుకంటే దర్శకుడు నాగ్ అశ్విన్ లెజండరీ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును కూడా తన టీమ్ లో చేర్చుకోబోతున్నాడు. సింగీతం శ్రీనివాసరావు 89వ పుట్టినరోజు సందర్భంగా వైజయంతి మూవీస్ స్పెషల్ విషెస్ అందిస్తూ ఒక మంచి అప్డేట్ ఇచ్చింది.50వసంతాల అనుభవం గల దర్శకుడు ప్రభాస్ సినిమా కోసం కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సింగీతంను ఎంచుకోవడానికి కారణం దర్శకుడు ఎందుకున్న కథ ఆయన గత సినిమాలకు దగ్గరగా ఉండడమే. టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా ఆదిత్య 369. ఆ సినిమా కోసం సింగీతం ఎంతగానో రీసెర్చ్ చేశారు. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ సినిమా కోసం టైమ్ ట్రావెల్ నేపథ్యంలోనే కథను రెడీ చేసుకున్నాడు. సో తప్పకుండా సింగీతం ఆలోచన విధానం ఉపయోగపడుతుందని నమ్మాడు. మరి ఆయన అనుభవం సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.