Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమ్మ నగలు అమ్మాల్సి వచ్చింది, ఇలాంటి అక్కచెల్లెళ్లు ఉన్నపుడు నేనెలా ప్రేమిస్తాను: రెహమాన్
"నేను సంగీత దర్శకుడిగా మారాక నాకు చాలామంది ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టారు. మా ఇంటికి చాలా ప్రేమలేఖలు వచ్చేవట. కానీ నా అక్క చెల్లెళ్లు వాటిని దాచేశారు": రెహమాన్
మొజర్తా ఆఫ్ మద్రాస్గా పేరుపొందిన రెహమాన్ తన సంగీత జీవితాన్ని మొదట రాజ్ కోటిల దగ్గర ప్రారంభించగా, తొలిసారి "యోధ" అనే సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఆ తర్వాత మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన రోజా చిత్రంకు రెహమాన్ తనదైన బాణీలు అందించగా, ఈ చిత్రం రెహమాన్ పేరును దేశమంతటా పాకేలా చేసింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు
ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో జైహో అనే పాటకు రెహమాన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోగా , ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హర్మోనియం, పియానో, కీబోర్డ్ ప్లేయర్గా ఇళయరాజా ట్రూప్లో పనిచేస్తూ జీవితం ఆరంభించాడు రెహమాన్.
ఇస్లామ్లోకి
1998వ సంవత్సరంలో రెహమాన్ కుటుంబమంతా హిందూ మతం నుండి ఇస్లామ్లోకి మారిపోగా అప్పటి నుండి దిలీప్ కుమార్ పేరు రెహమాన్గా మారిపోయింది. చిన్నతనంలోనే సంగీతంలో పడిపోయి.. ఆ సముద్రంలోనే మునిగి తేలాడు రెహమాన్. ఐతే తాను ఏ అమ్మాయితోనూ ప్రేమలో పడకపోవడానికి తన అక్కచెల్లెళ్లే కారణమని చెప్పాడు రెహమాన్.
ప్రేమలేఖలు
"నేను సంగీత దర్శకుడిగా మారాక నాకు చాలామంది ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టారు. మా ఇంటికి చాలా ప్రేమలేఖలు వచ్చేవట. కానీ నా అక్క చెల్లెళ్లు వాటిని దాచేశారు. ఒక్కటీ నా దగ్గరికి రానివ్వలేదు. చాలా లేఖల్ని చించేశారట. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఇలాంటి అక్కచెల్లెళ్లు ఉన్నపుడు నేనెక్కడ ఏ అమ్మాయినైనా ప్రేమిస్తాను'' అంటూ ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ నవ్వేశాడు.
తల్లి నగలు అమ్మి
తాను సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించే మొదట్లో స్టూడియో పెట్టడం కోసం డబ్బులు లేకపోతే తన తల్లి నగలు ఇచ్చిందని.. 28 ఏళ్ల కిందట కట్టిన ఆ స్టూడియోలోనే తన తొలి జింగిల్స్ చేశానని.. మణిరత్నంకు తన తొలి బాణీ వినిపించింది కూడా ఆ స్టూడియోలోనే అని గుర్తుచేసుకున్నాడు.
నగల్లో మూడింతలు
ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించాక తన తల్లికి అంతకుముందున్న నగల్లో మూడింతలు కొనిచ్చినట్లు రెహమాన్ చెప్పాడు. కడపలో పెద్ద దర్గాకు తరచూ రావడం గురించి రెహమాన్ మాట్లాడుతూ.. అక్కడికి వస్తే తన ఒత్తిడంతా మరిచిపోయి ప్రశాంతత కూడగట్టుకుంటానని రెహమాన్ అన్నాడు.