Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డైరక్టర్ వంశీ తీస్తున్న షార్ట్ ఫిల్మ్ ...పోస్టర్లు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వంశీ ఇటీవలే 25 చిత్రాలను పూర్తి చేశారు. అజ్మల్, నికితా నారాయణ్ జంటగా 'మెల్లగా తట్టింది మనసు తలుపు' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... ఆయనో షార్ట్ ఫిల్మ్ కు శ్రీకారం చుట్టారు.
VAMSY
garu
saradhaaga
muchata
Padithe
oka
short
film
chesaamu...
Vamsy's
LETTER!
Will
be
released
soon
on
YouTube!
pic.twitter.com/n8Ru95Cvt6
—
Madhura
Sreedhar
(@madhurasreedhar)
September
17,
2015
ఈతరం ప్రేమలు, బ్రేకప్లను తనదైన శైలిలో డిస్కస్ చేస్తూ 15 నిమిషాల నిడివితో వంశీ ఈ లఘుచిత్రం తీశారు. 'మధుర' శ్రీధర్ దీనికి నిర్మాత. ఇద్దరు కొత్త తారలతో దీన్ని తెరకెక్కించారు. త్వరలోనే ఈ లఘుచిత్రాన్ని యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.
—
Madhura
Sreedhar
(@madhurasreedhar)
September
18,
2015
వంశీ లాంటి సుప్రసిద్ధ దర్శకుడు షార్ట్ ఫిల్మ్ తీశాడంటే నిజంగా విశేషమే. బాలీవుడ్లో ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖ దర్శకులు షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టారు. కానీ తెలుగులో ఇంకా పూర్తి స్థాయిలో ఈ ట్రెండ్ మొదలు కాలేదు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వంశీ... తలుపు తట్టాడుఅజ్మల్, నిఖితా నారాయణ్ జంటగా నటించిన చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. వంశీ దర్శకత్వం వహించిన 25వ చిత్రమిది. అయితే ఈ సినిమా పేరు ఇప్పుడు మారింది. 'మెల్లగా... తట్టింది మనసు తలుపు!' అని కొత్తగా నామకరణం చేశారు. డి. వెంకటేష్ నిర్మాత.
అజ్మల్ చెబుతూ ''వంశీగారి సినిమా అనగానే చిక్కనైన తెలుగు కథలు, చక్కని పేర్లు గుర్తొస్తాయి. పసందైన సంగీతం ఉంటుంది. అవన్నీ ఈ సినిమాలోనూ ఉంటాయి. విచిత్ర కోణంలో సాగే ప్రేమకథ'' అన్నారు. వంశీ గత సినిమాల తరహాలోనే ప్రేక్షకులకి కనువిందు చేస్తుందన్నారు వెన్నెలకంటి.
నిర్మాత మాట్లాడుతూ ''చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయి. అవన్నీ శ్రోతల్ని ఆకట్టుకొంటాయి. కథకి ఈ పేరైతే ఇంకా బాగా కుదురుతుందనిపించి పేరు మార్చాం. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము''అన్నారు.
లేడీస్ టైలర్ విషయానికి వస్తే..
తాజాగా వంశీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమానూ 'మధుర' శ్రీధరే నిర్మించబోతున్నారు. విశేషం ఏమంటే ఈ మూవీలో ఏకంగా తొమ్మిది మంది హీరోయిన్లు నటించబోతున్నారట. 'లేడీస్ టైలర్' షేడ్స్ లో సాగే ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వంశీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ ఫైనల్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు.