Don't Miss!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ఆడియో,సినిమా విడుదల తేదీలు
ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఈ చిత్రం జూలై 27న ఆడియో విడుదల కానుంది. అలాగే చిత్రం ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఈ విషయాలను శేఖర్ కమ్ముల స్వయంగా మీడియాకు తెలియచేసారు. అలాగే ఆడియో విడుదల అయిన నాటి నుంచి ప్రమోషన్ ప్రారంభిస్తామని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి శేఖర్ కమ్ముల చెపుతూ...కాలంతోపాటుగా పరిగెడుతున్నాం. చిన్ననాటి జీవితాన్నీ, అప్పటి ఆనందాల్నీ, అనుభూతుల్నీ గుర్తుకు తెచ్చుకొనే తీరిక కూడా లేనంత వేగంగా ముందుకు సాగుతున్నాం. కానీ ఆ రోజులు ఇప్పుడోసారి మన ముందుకొస్తే ఎలా ఉంటుంది? అమ్మ చేతి గోరుముద్దలు దగ్గర్నుంచి మొదలుపెడితే... టీచర్ కొట్టిన దెబ్బలు, కాగితపు పడవలు, గల్లీలో క్రికెట్ ఆడుకొన్న రోజులు, వెన్నెల రాత్రిలో డాబా మీద పడక, ఆ పక్క నుంచి వినిపించే ఘంటసాల పాట... ఆహా ఎన్నెన్ని అనుభూతులో కదూ. మా చిత్రంతో వాటన్నింటినీ ఓసారి గుర్తుకు తెస్తామంటున్నారు శేఖర్ కమ్ముల.
సరస్వతి సిగ్గుపడే సినిమాలు నేను తీయను. అందరూ మెచ్చే సినిమాలే నా నుంచి వస్తాయి. అందరూ కష్టపడి ఈ సినిమాకు పని చేశారు. హైదరాబాద్లోని పద్మారావు నగర్లో అన్ని కమ్యూనిటీలూ సెట్ అయ్యే విధంగా ఓ అందమైన కాలనీని నిర్మించాం. వేటూరిగారు లేకపోవడంతో వనమాలి, అనంత శ్రీరామ్ ఇందులో పాటలు రాశారు అని శేఖర్ కమ్ముల తెలిపారు. శేఖర్కమ్ముల మిత్రుడు మనోహర్ మాట్లాడుతూ -''శేఖర్ రెండేళ్ల తపస్సు ఈ సినిమా. పిల్లలకు, పెద్దలకు, యువతరానికీ, ఎన్ఆర్ఐలకు తమ పాతరోజుల్ని గుర్తు చేసే సినిమా ఇది'' అని చెప్పారు.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగుణ్, జారా, రష్మి, కావ్య, నవీన్, విజయ్ సంజీవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారులు. చంద్రశేఖర్ కమ్ముల, శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి రత్నకుమార్, కళ: తోట తరణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు: వనమాలి, అనంతశ్రీరామ్, ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్, సంగీతం: మిక్కీ జె.మేయర్.