Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పి.సుశీలకు జీవిత సాఫల్య పురస్కారం
అనంతరం సుశీల ఆధ్వర్యంలో ''సుగంధాల పాట- సుశీలమ్మ నోట' తెలుగు మధుర గీతాలాపన, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, శ్రీకృష్ణ లీలామృతం నాటకం తదితర కార్యక్రమాలు కూడా ఉత్సవాల్లో భాగంగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆంధ్రా కోకిల సుశీల 1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించారు.విజయనగరం,మద్రాసు సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది 12ఏటనే తొలి కచేరీ చేశారు. రేడియోలో కచేరీలు, ఆ తర్వాత సినిమారంగంలోకి అడుగుపెట్టడంతో అప్రతిహతంగా ఆమె ప్రస్ధానం కొనసాగింది. నిజంగా ఆమె గానకౌశలం వర్ణనకు అందనిది.
హుషారు, విషాదం, భక్తీగీతం, యుగళగీతం ఇలా ఒక్కటేమిటీ పాట ఏదైనా ఆమె పాడితే దానికొక సార్ధకత వస్తుంది. అమె గొంతులోని మాధుర్యం మనసుని పరవశింప చేస్తుంది. తన గొంతుతో నవరసాలు పలికించి తెలుగుపాటనే పునీతం చేశారు. ఈ మధ్య అయితే సుశీలమ్మ పాడటం తగ్గించారేమో కానీ 1957 నుంచి మొదలుకుని 90 మధ్యకాలంలో ఆమె పాట వినిపించని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.ఆమె గానమాధుర్యంతో పులకించని ప్రేక్షకుడూ లేడు.
తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో సుశీల ఐదుసార్లు జాతీయ అవార్డులతోపాటు అన్నేసార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కేంద్రప్రభుత్వం పద్మభూషణ్తో ఆమెను సత్కరించింది. ఇక రాష్ట్రప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును 2002లో అందుకున్నారు. 60ఏళ్ల సినీ ప్రస్ధానాన్ని అలవోకగా గడిపేసిన ఈ గానకోకిల తన పేరిట ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి , ఏటా తన పుట్టినరోజున సంగీత విద్వాంసులను సన్మానించడం సుశీలమ్మకే చెల్లింది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో వేలాది పాటలు పాడిన సుశీల పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా రెండుసార్లు 1969లో, 1971లో తమిళ చిత్రాల్లో పాడినందుకు స్వీకరించారు. ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కలైమామణి' బిరుదు అందుకున్నారు. ఎన్నో పాటలు పాడిన సుశీలకు చక్రవాకంలోని 'వీణలోనా..' పాట అంటే చాలా ఇష్టం.