twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ వందో చిత్రాన్ని శ్రీరామరాజ్యం డిసైడ్

    By Srikanya
    |

    బాలకృష్ణ తాజా చిత్రం శ్రీరామ రాజ్యం ఇప్పుడు బాలకృష్ణకు కెరీర్ పరంగానే కాకుండా వంద సినిమాగా ఏమి చెయ్యాలనే విషయం నిర్ణయించుకోవటానికి కీలకంగా మారింది. నిజానికి ఈ చిత్రం కి ఎక్సపెక్టేషన్స్ పెరగటానికి బాలకృష్ణ, బాపు కాంబినేషన్ ఓ రీజన్ అయితే, లవకుశ రీమేక్ కావటం కూడా మరో కారణం. ఈ చిత్రం హిట్టయితే ఇదే జనర్ లో మరో మైధలాజికల్ సబ్జెక్టుని చేయాలని తన వందో చిత్రంగా బాలకృష్ణ నిర్ణయించుకున్నారట. అలా కాకపోతే సింహా లాంటి మాస్ ఎంటర్టైనర్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇక శ్రీరామరాజ్యం విషయానికి వస్తే..ఈ చిత్రంపై బాలకృష్ణ అభిమానులే కాక పౌరాణిక చిత్రాలను ఇష్టపడే వారంతా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మొదట దశరాకు వస్తుందనుకున్న ఈ చిత్రం ఆ తర్వాత రేసు నుంచి తప్పుకుంది. దానికి కారణం అందరూ ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఊసరవిల్లి చిత్రం అనుకున్నారు. అయితే అది కారణం కాదని తెలుస్తోంది.

    ఈ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం సంగీత దర్శకుడు ఇళయరాజా అని చెన్నై పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుంది. ఆయన కుమారుడు యవన్ శంకర్ రాజా వివాహం హడావిడి,బంధువులు రాకపోకలు వీటిలో ఆయన పూర్తిగా మునిగిపోయాడని అందుకే రీ రికార్డింగ్ చేయలేదని అదే సినిమా విడుదల ఆగటానికి మెయిన్ కారణమని చెప్తున్నారు. ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధానిబుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నారు.

    English summary
    Nandamuri balakrishna needs to experiment his memorable 100th film with same genre rather than doing regular commercial mass masala subject.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X