జె.డి వచ్చాడు... బాలయ్య 'లయన్' వివాదం మళ్లీ మొదటికి
హైదరాబాద్: బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్'. ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ ని తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ లో ముందే రిజిస్టర్ చేసామని వేరే నిర్మాత చెప్పారు. అయితే ఈ లోగా ఏం జరిగిందో... 'లయన్' టైటిల్ తో బాలకృష్ణ చిత్రం ప్రోమో,పోస్టర్స్ వచ్చి ప్రాచుర్యం పొందాయి. అంతా సెటిల్ చేసుకున్నారు అనుకున్నారు. అయితే కథ మళ్లీ మొదటకి వచ్చింది. ఈ చిత్రం టైటిల్ మాదే అంటూ ఆ నిర్మాతలు,దర్శకుడు జెడీ కలిసి నిన్న 'లయన్' టైటిల్ ని ఆవిష్కరించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఆ చిత్రం వివరాల్లోకి వెళితే..
సాయిదీపు, సితార, విశాలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం'లయన్'. జె.డి దర్శకుడు. జగదీష్, కడారి ప్రభాకర్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్లో 'లయన్'లోగో ఆవిష్కరించారు.

దర్శకుడు మాట్లాడుతూ ''తన ప్రేమను సాధించుకోవడానికి యువకుడు చేసిన పోరాటం ఈ సినిమా. ప్రేమ, వినోదం, కుటుంబ బంధాలు కలగలిపి ఆవిష్కరించాము''అన్నారు. ''లయన్ పేరును ముందుగా మేమే రిజిస్టర్ చేయించాం. అదే పేరుతో సినిమా విడుదల చేస్తున్నాం. ఓ షెడ్యూలు పూర్తయింది''అన్నారు నిర్మాత.
బాలకృష్ణ ‘లయన్' విషయానికి వస్తే...
బాలకృష్ణ తాజా చిత్రం ‘లయన్' ఆడియోని ఏప్రిల్ 9న రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించారు. ఏప్రిల్ 9న శిల్పకళ వేదికలో గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్యాచ్ వర్క్ సీన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రధాన తారాగణంపై ఓ ఫ్యామిలీ సాంగ్ షూట్ ని ఫినిష్ చెయ్యడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అలాగే ‘లయన్' సినిమా ఆ
అలాగే ఈ సినిమాని ఏప్రిల్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది.
‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.
త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు.
నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.
అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు


Click it and Unblock the Notifications











