Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కాజోల్ గాజులు చోరి..దొంగలు దొరికారు
ముంబయి: బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, కాజోల్ దంపతులకు చెందిన జుహూ బంగ్లాలో బంగారు గాజులు చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గాజులను చోరీ చేసిన కేసులో ఇద్దరు నౌకర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నివాసంలో పని చేసిన గాయత్రి దేవేంద్ర, సంతోష్ పాండేలు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గత రెండు, మూడేళ్లుగా గాయత్రి దేవేంద్ర, సంతోష్ పాండే అనే నౌకరులిద్దరు దేవగణ్ బంగ్లా వెలుపల శుభ్రం చేసే పనులు చేస్తున్నారు. కర్వాచౌత్ పర్వదినం సందర్భంగా ఇంటిని శుభ్రం చేసే పనిని వీరికి అప్పగించగా దొంగతనానికి పాల్పడ్డారు. ఈ నెల 19న బంగారు గాజులను అపహరించగా మూడు రోజుల తర్వాత కాజోల్ ఈ విషయాన్ని గ్రహించారు.
22న కర్వాచౌత్ పండుగ నాడు బంగారు గాజులు కన్పించకపోవడంతో కాజోల్ జుహూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు అయిదు లక్షల విలువైన 17 గాజులు కన్పించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బీరువాలోని ఆభరణాల పెట్టెలో నుంచి ఈ గాజులను అపహరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తులో భాగంగా నౌకర్లు, ఇతర అనుమానితులను విచారించారు. కొందరు వ్యక్తులకి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించగా గాయత్రి నేరం అంగీకరించింది.
ఆమె వెల్లడించిన వివరాల మేరకు నాలాసోపరాకు చెందిన పాండేను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు నాలుగు గాజులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మిగితా గాజులను కరిగించి వేశారు. దేవగణ్ నివాసంలో దొంగతనం జరగడం ఇది రెండోసారి. 2008లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ఒక నౌకరును అరెస్టు చేశారు. ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు పోలీసు కమిషనర్ (పడమర) విశ్వాస్ నంగ్రే పాటిల్ తెలిపారు.