twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానులందరికి అనుకూలమైన టికెట్టు ధర: బాలకృష్ణ

    By Sindhu
    |

    జూన్ 13 న జరిగే టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ సన్నాహాలని అంతా తానై పర్యవేక్షిస్తున్న నందమూరి నటసింహాం బాలకృష్ణ మ్యాచ్ విశేషాలని మీడియాకి తెలియజేశారు. వచ్చే నెల జూన్ 13 న ఎల్.బి. స్టేడియం లో జరిగే స్టార్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, నగర మేయర్ కార్తీక రెడ్డి, మంత్రి ముకేశ్ గౌడ్, ఎమ్.పి. ఆంజన్ కుమార్ యాదవ్, ఖదీర్ భాషా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారు తదితరులు హాజరవుతారని తెలియజేశారు. మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి మాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె. రోశయ్య గారు హాజరవుతారన్నారు. ఉదయం 9:30 గం:లకు మ్యాచ్ మొదలు కావడానికి ముందు అన్ని జట్లు కలిసి స్టేడియంలో యాంటీ పైరసీ రన్ ని నిర్వహిస్తాం. ఆ తరువాత మ్యాచ్ మొదలవుతుంది. మధ్య మధ్యలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి అని తెలిపారు.

    నా టీమ్ పేరు 'బాలయ్య లయన్స్", చిరంజీవి గారి టీమ్ పేరు 'చిరు చీటాస్", నాగార్జున గారి టీమ్ పేరు 'నాగ్ కింగ్స్", వెంకటేష్ బాబు టీమ్ పేరు 'వెంకీ వారియర్స్". గతంలోలా కాకుండా ఈ సారి అభిమానులందరికీ అందుబాటులో ఉండేలా టికెట్టు ధరను 200/- రూపాయలుగా నిర్ణయించారు. స్టేడియంలో ఎక్కడ ఏ గ్యాలరీలో అయినా కూర్చోవచ్చు. ఒకవేళ వివిఐపి పాసులు కావాలంటే మాత్రం రూ.10,000/- గా ఉంటుంది.

    కాబట్టి, ప్రేక్షకులు, అభిమానులు అందరూ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూడాటానికి తరలి వచ్చి… ఒక మంచి పనికోసం చేసే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X