Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మదనమ్మ తుదిస్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె అంత్య క్రియలు స్వగ్రామమైన చల్లగిరిలో జరుగనున్నాయి.
చంద్రబోస్ స్వగ్రామం వరంగల్ జిల్లా చిట్యాల మండల చల్లగిరి గ్రామం. నర్సయ్య, మదనమ్మ దంపతుల నలుగురు సంతానంలో చంద్రబోస్ అందరికంటే చిన్నవాడు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. వారి మూలంగా చిన్నతనంలోనే చంద్రబాబోస్లో సాహిత్యబీజం పడింది.
గతంలో ఓ సందర్భంలో చంద్రబోస్ మాట్లాడుతూ.. చిన్నతనంలో తన తల్లి ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూపించేందుకు తనను తీసుకెళ్లేదని, ఈ క్రమంలోనే తాను సాహిత్యంపై, పాటలపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలిపారు. అలా జరిగి ఉండకపోతే తాను ఇపుడు ఈ రంగంలో ఉండేవాడిని కాదేమో అన్నారు.
ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పట్టబద్రుడైన చంద్రబోస్... దూరదర్శన్లో సింగర్గా ప్రయత్నించాడు. అయితే అది ఫలించక పోవడంతో తన స్నేహితుడి సూచన మేరకు పాటలు రాయడం వైపు టర్న్ అయ్యారు. 1995లో తొలిసారిగా 'తాజ్ మహల్' అనే చిత్రానికి పాటలు రాశారు.