Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'గబ్బర్ సింగ్' గా మరోసారి ఎమ్.ఎస్.నారాయణ(ఫోటో)
దర్శకుడు గోవింద్ మాట్లాడుతూ "డబ్బు రుచి మరిగిన మనిషి దాని కోసం ఎన్ని అడ్డదార్లు తొక్కుతున్నాడు, దాని వల్ల ఏం నష్టపోతున్నాడనేది ఇందులోని ప్రధానాంశం. నేటి సామాజిక అన్యాయాలు ఇతివృత్తంగా తీసుకుని అల్లుకున్న ఈ కథలో డబ్బు రుచిమరిగిన మనిషి ఎలా ఉంటాడు, అందుకోసం అతను ఎన్ని అడ్డదారులలో డబ్బు సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తాడు? చివరికి మనిషిగా పతనమై ఎలా నష్టపోతున్నాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నామని తెలిపారు. దర్శకుడు ఓ విభిన్నమైన కథ చెప్పడంతో ఈ చిత్రాన్ని ప్రారంభించామని, కామెడీ ఎంటర్టైనర్గా ఉంటూ ప్రేక్షకులకు సందేశాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది'' అని తెలిపారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నట్లు అక్షయ్తేజ్ చెప్పారు.
నిర్మాత ఒకరైన చిరంజీవులు నాయుడు మాట్లాడుతూ "మొదటి షెడ్యూల్ను 40 రోజుల పాటు వైజాగ్లో జరిపాం. ప్రస్తుతం రామకృష్ణా స్టూడియోస్లో వేసిన యమలోకం సెట్లో రాజేంద్రప్రసాద్, నరేశ్, కృష్ణభగవాన్పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం'' అని చెప్పారు. అక్షయ్తేజ్, సోనియా బిర్జి జంటగా విక్రమార్క ప్రొడక్షన్స్ పతాకంపై బి. చిరంజీవులు నాయుడు, రొట్టా అప్పారావు సంయుక్తంగా 'మనుషులతో జాగ్రత్త' నిర్మిస్తున్నారు. గోవింద్ వరహా దర్శకుడు. వసుంధర సమర్పిస్తున్నారు.