Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ఒక్కడు’స్టార్ట్ అవ్వడం వెనుక... : ఎమ్మెస్ రాజు
అలాంటి టైమ్లోనే 'మురారి' సినిమా విడుదలైంది. నాకు సినిమా తెగ నచ్చేసింది. ఆ విషయమే కృష్ణగారికి చెప్పాను. మహేష్తో ఓ సినిమా చేయాలని ఉందని ఆయనతో అన్నాను. మాటల్లో మాట దివిసీమ నేపథ్యంలో ఓ ప్రేమకథ చేస్తే బావుంటుందని కృష్ణగారితో చెప్పాను. ఆయన కూడా బావుంటుందన్నారు. మహేష్తో కూడా ఆ టైమ్లో కొన్ని డిస్కషన్స్ జరిగాయి. 'మనసంతా నువ్వే' కథ కూడా మహేష్కి చెప్పాను. కానీ ఆయన పెద్ద ఇంట్రస్ట్ చూపలేదు. అదే టైమ్లో మహేష్కి గుణశేఖర్ ఓ కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని, కథానుగుణంగా ఓ భారీ సెట్ని నిర్మించాలని, దాంతో ఆ సినిమాను హ్యాండిల్ చేయడానికి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. సరిగ్గా అప్పుడే గుణశేఖర్ ఫోన్ చేసి, 'నేను మహేష్బాబు దగ్గర ఉన్నాను.. ఓసారి వస్తారా.. మాట్లాడాలి' అన్నాడు. సరేనని వెళ్లాను. 'ముగ్గురం కలిసి ఓ ప్రాజెక్ట్ చేద్దాం' అన్నాడు గుణశేఖర్. అదే 'ఒక్కడు'.
'మీ ఫుల్ ఎఫర్ట్ పెట్టండి రాజుగారూ... చేద్దాం' అన్నాడు మహేష్. 'ఫుల్ ఎఫెర్ట్ పెట్టడం అంటే... ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదు. ఈ సినిమా నేను హ్యాండిల్ చేసేదీ... చేయందీ నా 'మనసంతా నువ్వే' విజయంపైనే ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్ అయితే.. వచ్చిన డబ్బంతా మీ సినిమాకు పెడతాను. హిట్ కాకపోతే.. మాత్రం మీ సినిమాను నేను హ్యాడిల్ చేయలేను' అని మహేష్కి నిర్మొహమాటంగా చెప్పేశాను. కానీ మహేష్ మాత్రం ససేమిరా అన్నాడు. 'మనసంతా నువ్వే' హిట్ అయినా... అవ్వకపోయినా 'ఒక్కడు' మీరే తీయాలి' అని పట్టుపట్టాడు. 'చార్మినార్ సెట్ వేయడమే ఆ సినిమాకు భారం అనుకుంటే... ఆ సెట్టే వేయొద్దు. అవసరం అనుకుంటే... రియల్ చార్మినార్ దగ్గరే షూటింగ్ చేద్దాం. అప్పుడు బడ్జెట్ కూడా తగ్గిపోతుంది' అన్నాడు. నేను అన్యమనస్కంగానే అంగీకరించాను.
లక్కీగా 'మనసంతా నువ్వే' భారీ విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బు మొత్తం 'ఒక్కడు'కి పెట్టేశాను. ప్రేక్షకులను అబ్బుర పరిచే రేంజ్లో చార్మినార్ సెట్ వేయించాను. నిర్మాతకు కేరక్టర్ ఎంత ముఖ్యమో... డబ్బు కూడా అంతే ముఖ్యమని, ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మించాలంటే... నిర్మాతకు వెనుక ఓ విజయం ఉండాలని 'మనసంతా నువ్వే' విజయంతో నాకు తెలిసొచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వకపోతే.. 'ఒక్కడు' తీయగలిగేవాణ్ణి కాదు. 'ఒక్కడు'తో మా తలరాతలే మారిపోయాయి. 'నీ స్నేహం' చిత్రానికి కొంత మేర నష్టం వాటిల్లితే... 'ఒక్కడు' దాన్ని పూడ్చేసింది. అంత పెద్ద విజయాన్ని మహేష్తో తీసిన నేను, మళ్లీ ఆయనతో సినిమా చేయకపోవడమేమిటనేది ఇప్పటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్న అన్నారు ఎంఎస్ రాజు.