Don't Miss!
- News సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత: ఎందుకంటే?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
ఎం.ఎస్.రాజు కొత్త చిత్రం ‘మిర్చి’ ప్రారంభం
మెగా మేకర్ గా పేరు తెచ్చుకున్న ఎం.ఎస్.రాజు తన కుమారుడు సుమంత్ అశ్విన్ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న 'మిర్చి" చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం పూణెలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్.రాజు స్వయంగా దర్సకత్వం వహిస్తున్నారు. వాన చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఆయన గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక వాన సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎలాగయినా ఒక్క సక్సెస్ ఇచ్చి డైరక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆయన కసిగా ఉన్నారు.
అందుకోసం కొడుకు కెరీర్ నే పణంగా పెడుతున్నారు. మొదట ఈ చిత్రానికి మనసంతా నువ్వే లాంటి హిట్ ఇచ్చిన వియన్ ఆదిత్యను దర్శకుడుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన సీన్ లో లేరు. సుమంత్ సినిమా రాజ్ ను డైరక్ట్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇక ఎమ్.ఎస్.రాజు తాను తయారు చేసుకున్న కథపై నమ్మకంతో ఈ సాహసం చేస్తున్నాడని సక్సెస్ అయ్యే అవకాశమే ఎక్కువుందని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు స్కీమ్ లో ఒకే సినిమాతో కొడుకు హీరోగానూ, తండ్రి దర్శకుడుగా, నిర్మాతగా బ్రేక్ రావాలని ప్లాన్ చేసారని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి రాజుగా పేరు తెచ్చుకున్న ఎమ్.ఎస్.రాజు ఈ చిత్రాన్ని మాత్రం సమ్మర్ కి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.