Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మా’లో తీవ్ర లుకలకలు.. అధ్యక్షుడు వీకే నరేష్పై రాజశేఖర్ వర్గం తిరుగుబాటు?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో మళ్లీ లుకలుకలు చోటుచేసుకొన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా మా అధ్యక్షుడు వీకే నరేష్పై సభ్యులు తిరుగుబాటు బాహుటా ఎగురవేసినట్టు తెలిసింది. వీకే నరేష్కు వ్యతిరేకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చిన వార్త టాలీవుడ్లో సంచలనం రేపుతున్నది. ఈ వివాదానికి కారణం ఏమిటంటే..
‘మా'లో గొడవలు
కొద్దికాలంగా మా యూనియన్లో గొడవలు చోటుచేసుకొంటున్నాయి. గతంలో శివాజీ రాజాకు, నరేష్కు మధ్య జరిగిన వివాదం సద్దుమణిగిందని అనుకొన్నారు. కానీ తాజాగా రాజశేఖర్, నరేష్కు మధ్య కొత్తగా అధిపత్య పోరాటం జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఇటీవల 20 మంది మా సభ్యులతో రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం జరగడం ఈ వివాదానికి బలం చేకూరిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
వీకే నరేష్పై విమర్శలు
మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వీకే నరేష్పై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. అలాగే నిధులు సేకరణ చేపట్టకపోగా.. పలు రకాలుగా నిధులను ఖర్చు చేస్తున్నారనేది మరో ఆరోపణ. ఈ నేపథ్యంలో వీకే నరేష్ వ్యవహారంపై 20 మందికిపైగా సభ్యులు సమావేశంపై తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.
నిధుల దుర్వినియోగం
తెలంగాణ ప్రభుత్వానికి వ్యాపార ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించిన రూ.750000 దుర్వినియోగమైనట్టు ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ ఆరోపణపై ఎలాంటి సమాచారం బయటకు రాకుండా మా యూనియన్ చర్యలు తీసుకొంటున్నది. ఇలాంటి కొన్ని నిధుల వ్యయాలు గురించి సంఘంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం.
షోకాజ్ నోటీసుల జారీ చేసేందుకు
మంగళవారం (సెప్టెంబర్ 10)న హీరో రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. అధ్యక్షు వీకే నరేష్కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఉపాధ్యక్షుడైన రాజశేఖర్ ఏకంగా అధ్యక్షుడి స్థానంలో కూర్చొని కమిటీ సమావేశపరచడం చర్చనీయాంశమైంది. దీనిని బట్టి మా సంఘంలో భారీగా విభేదాలు చోటుచేసుకొన్నట్టు తెలుస్తున్నది. అధికారికంగా సంఘం ఇలాంటి సంఘటనలపై మీడియాకు ఎలాంటి సమాచారం ఇస్తుందా అనే విషయం మీడియాలో ఆసక్తిని పెంచింది.