Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'మా' ఎన్నికలు: ఓటమిని జయసుధ ముందే ఊహించారా?
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రముఖ సినీ నటి జయసుధ ముందే ఊహించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఓటమిని పసిగట్టడం వల్లనే ఆమె ఓట్ల లెక్కింపునకు హాజరు కాలేదనే ప్రచారం సాగుతోంది. ఆమె తరపున ఆమె సమీప బంధువు, ప్రముఖ సినీ నటుడు నరేష్ హాజరయ్యారు.
గురువారంనాడు ఓట్ల లెక్కింపు జరిగిన ఫిలిం ఛాంబర్ వైపు ఆమె కన్నెత్తి చూడలేదు. లెక్కింపు ప్రారంభమైన తర్వాత ప్రతి రౌండ్లోనూ జయసుధపై అధ్యక్ష పదవికి పోటీ చేసిన రాజేంద్రప్రసాద్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు.
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నరేష్ అక్కడే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ జయసుధపై 85 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. మా ఎన్నికలు ఈసారి వేడిగా జరిగాయి. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో జరిగాయి.
ఆరోపణలు, ప్రత్యారోపణలతో మా ఎన్నికలు వేడిగా సాగాయి. మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మురళీ మోహన్ ప్యానెల్ తరఫున జయసుధను అధ్యక్ష పదవికి పోటీకి దించారు. దాంతో వాతావరణం వేడెక్కింది.