Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
'మా' ఎన్నికలు: మురళీ మోహన్పై నాగబాబు విజయమా?
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు నాగబాబు మద్దతు ఇచ్చి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించారు. రాజేంద్ర ప్రసాద్ వెంట నాగబాబు నామినేషన్ వేసినప్పటి నుంచి చివరి దాకా నించున్నాడు. ఆయన పెద్దగా హంగామా చేసిందేమీ లేదు గానీ స్థిరమైన మద్దతు ఇచ్చారు.
నాగబాబు మద్దతు ఇవ్వడంతో వెనక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే, వాటిని నాగబాబు పట్టించుకున్నట్లు కనిపించలేదు. మా ఎన్నికల్లో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న సమయంలోనూ ఆయన పెద్దగా ముందుకు రాలేదు. మౌనంగానే మార్పునకు ఆయన నాంది పలికినట్లు కనిపిస్తున్నారు.
రాజేంద్ర ప్రసాద్ తన ప్యానల్తో కలిసి మురళీమోహన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిగా జయసుధ తదితరులు జవాబు ఇచ్చారు. దానితో ఆగకుండా మురళీ మోహన్ ఓ టీవీ చానెల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
మా తరఫున తాను చేసిన పనులను ఆయన ఆ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా, మురళీ మోహన్ జయసుధను గెలిపించలేకపోయారు. ఆ విషయంలో నాగబాబు విజయం సాధించారు.