Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మా’ ఎన్నిక ఫలితాలు మళ్లీ వాయిదా
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) ఎన్నికల ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ రోజు ఫలితాలు వెలువరించడానికి కోర్టు అనుమతిస్తుందని అంతా భావించారు. అయితే సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా వేసింది.
ఎన్నికలు గత నెల చివర్లో పూర్తయినా కోర్టు కేసు కారణంగా ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని, కోర్టు తదుపరి తీర్పు వెల్లడించే వరకు ఫలితాలు వెల్లడించరాదని అప్పట్లో కోర్టు ఆదేశించింది ‘మా' ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నటుడు ఒ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయమూర్తి ‘మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆలీకి నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటులు మురళీమోహన్, అలీలు ఇటీవల కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. 'మా' ఎన్నికల జరిగిన తీరును వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు గత నెల 31న కోర్టుకు సమర్పించారు.
(మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్ వర్గం...., జయసుధ వర్గం ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల తూటాలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. ఈ నేపథ్యంలో ‘మా' అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.