Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బ్లూఫిల్ముల్లో కాదు..
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సినీనటి రోజాపై, ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి చేసిన విమర్శలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఖండించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఆసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ, శోభారాణి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.
చదవుకున్న వ్యక్తిగా, సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పని చేసిన శోభారాణి ఒక నటిని పరుషపదజాలంతో దూషించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. తెలుగు చలన చిత్రానికి చెందిన నటులు ఎవరెవరు ఏ పార్టీలలో ఉన్నా వ్యక్తిగత దూషణలు మానుకోవాలన్నారు. ఇలాంటి ధోరణులను అరికట్టేందుకు అందరూ బాధ్యతగా పూనుకోవాలన్నారు. ఇప్పటికే రోజా క్షమాపణ చెప్పింది, అలాగే శోభారాణి కూడా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాపై పిఆర్పి మహిళా రాజ్యం చీఫ్ శోభారాణి వ్యాఖ్యలను సినీ ప్రముఖులు ఖండించారు. ఎవరైనాసరే రాజకీయాల్లో నైతికంగా దిగజారుడు వ్యాఖ్యలను మానుకోవాలని మురళీమోహన్ హితవు పలికారు. సినీ ఆర్టిస్ట్లపై చులకనభావంతో చూడటం తగదని జీవితారాజశేఖర్ అన్నారు. తమపై అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం సరైన పద్దతి కాదని జయసుధ వ్యాఖ్యానించారు.
ప్రజారాజ్యం మహిళా అధ్యక్షురాలు శోభారాణి, తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు రోజా పరస్పరం చేసుకున్న మాటల దాడి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శోభారాణి వ్యాఖ్యలను ప్రజారాజ్యం పార్టీ అధినేత తీవ్రంగా ఖండిస్తే, రోజాను చంద్రబాబు తీవ్రంగా మందలించి, శోభారాణికి తీవ్రంగా హెచ్చరిక చేశారు.
మరోపక్క ఎలక్ట్రానిక్ మీడియాలో మహిళా నేతలు వీరి ధూషణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మహిళలపై మహిళలే అసభ్య పదజాలంతో ధూషించుకోవడానికి రాజకీయాలే కారణమని ధ్వజమెత్తారు. ఇంకోపక్క రోజా శనివారం నాడు కూడా ప్రజారాజ్యం పార్టీపై విమర్శల దాడి ఆపలేదు. చిరంజీవిని టార్గెట్గా చేసుకుని రోజా ప్రశ్నాస్త్రాలు సంధించారు.