Don't Miss!
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జగపతిబాబు "మా నాన్న చిరంజీవి" ఏమైంది?
హాలీవుడ్ చిత్రం 'ఫర్ష్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' ఫ్రీమేక్ గా వచ్చిన 'మా నాన్న చిరంజీవి' చిత్రం శుక్రవారం రిలీజైంది. జగపతిబాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం ఆశించిన మేరకు ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయింది. అలాగే శని, ఆధివారాలు కూడా కలెక్షన్స్ డల్ గా ఉన్నాయి. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలక పోయిందని పెదవి విరుస్తున్నారు. స్లో నేరేషన్ సినిమాను సగం చెడకొట్టిందని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం కథ చిరంజీవులు(జగపతిబాబు) చుట్టూ తిరుగుతుంది. భార్య నీలిమ (నీలిమ) అత్యాశ కారణంగా ఉన్న ఆస్థినంతా స్టాక్ మార్కెట్లో, సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టి మొత్తం పోగొట్టుకుంటాడు. అప్పుడు అతణ్ని భార్య విడిచిపెట్టి వెళ్లిపోతుంది. వారి బిడ్డ అతులిత్ మాత్రం చిరంజీవులుతోనే ఉంటానంటాడు. భార్య లేని ఆ ఊళ్లో ఏకాకిలా ఉండలేక కొడుకును తీసుకొని సిటీ వెళ్తాడు చిరంజీవులు. ఇక అక్కడ్నుంచి జీవన పోరాటం ప్రారంభమవుతుంది. కొడుకును సాకటానికి చిరంజీవులు నానా యాతన పడతాడు. చివరకు అతను తిరిగి ఎలా తన ఉన్నత స్ధానానికి పొందాడు అనే కోణంలో కథ నడుస్తుంది.
ఇక గతంలో పవన్ కళ్యాణ్ తో తమ్ముడు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఈ సినిమాను డైరక్ట్ చేసాడు. ఫ్యామిలీలకు ఈ చిత్రం నచ్చితే ఈ చిత్రం వర్కవుట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఆ వాతావరణం ఏమీ కనపడటం లేదు.