Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘చిరంజీవి’ వెరీ వెరీ స్పెషల్: జగపతి బాబు
చిరంజీవి వెరీ వెరీ స్పెషల్ అంటున్నాడు హీరో జగపతిబాబు. ఇక్కడ జగపతిబాబు చెపుతున్నది హీరో చిరంజీవి గురించి కాదు....'మా నాన్న చిరంజీవి" సినిమా గురించి. ఫ్రైమ్ స్టార్ జగపతి బాబు హీరోగా 'తమ్ముడు" ఫేం అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న 'మా నాన్న చిరంజీవి" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది".
ఈ సందర్బంగా హీరో జగపతి బాబు మాట్లాడుతూ అరుణ్ ప్రసాద్ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఇందులో నా క్యారెక్టర్ పేరు చిరంజీవులు. నాకొడుక్కి పెద్ద హీరోని, బాగా స్ట్రగుల్ అయ్యే కారెక్టర్. ప్రతి మనిషికి స్ట్రగుల్ వుంటుంది. కానీ మనం ఎలాంటి స్ట్రగుల్ ఎదుర్కొంటున్నా నవ్వుతూ ముందుకు సాగాలి అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఈ సినిమా తన కెరీర్ లోనే ఓ స్పెషల్ మూవీ అనీ, భావోద్వేగాలన్నీ మిళితమైన ఈ చిత్రంలో నటించడాన్ని అదష్టంగా భావిస్తున్నానని జగపతిబాబు చెప్పుకొచ్చాడు. తండ్రి, కొడుకుల మధ్య అప్యాయతానురాగాలు 'మా నాన్న చిరంజీవి" సినిమాలో అత్యద్బుతంగా దర్శకుడు తెరకెక్కించాడనీ, ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందనీ జగపతిబాబు అశాభావం వ్యక్తం చేశాడు. కమర్షియల్ యాంగిల్ కన్నా, మంచి చిత్రంగా 'మా నాన్న చిరంజీవి" అత్యద్భుత విజయం సాధిస్తుందనీ, కమర్షియల్ అంశాలూ సినిమాలో వున్నాయనీ చెబుతున్నాడు జగపతి బాబు.