Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘మా ఊళ్లో ఓసారి ఏం జరిగిందంటే...’రెడీ
కుంతల్, సిరిశ్రీ జంటగా నవ్య ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై చెందు దర్శకత్వంలో ఎంవిఎల్కె.రావు నిర్మిస్తున్న చిత్రం 'మా ఊళ్ళో ఓసారి ఏం జరిగిందంటే". ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తొలికాపీ సిద్ధమైంది. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -'కోనసీమ అందాలను ఆవిష్కరించిన అందమైన ప్రేమకథ ఇది. తొలికాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తాం. ఓ ఊళ్లో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందించాం.
పచ్చని పొలాల మధ్య కంటికి అందంగా కెమెరా అందమైన దృశ్యాలను చూపిస్తుంద"ని తెలిపారు. జయపాల్, మారుతి వేదం జ్ఞానశేఖర్, రమణ, వ్యాసమూర్తి, ఉమాదేవి, అనంత్, దుర్గారావు, ఆకొండి పవన్కుమార్, సాయి స్వరూప్, విజయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయపాల్, సంగీతం: మారుతీరాజా, ఎడిటింగ్: పి.శ్రీనివాస్, నిర్మాత: ఎం.వి.ఎల్.కె.రావు, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: చెందు. వంశీ చిత్రాల తరహాలో రూపొందించిన పోస్టర్ తో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.