Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అలాంటి అనుభవం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు.. కన్నీరు పెట్టుకున్న మాధవీలత
మాధవీలత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటూ ధైర్యాన్ని ప్రదర్శిస్తుందో అందరికీ తెలిసిందే. ఎలాంటి విమర్శలనైనా, ఎలాంటి కామెంట్లకైనా సరే ధీటుగా సమాధానమిస్తుంటుంది. అలాంటి మాధవీలత నిన్న రాత్రి కంటతడి పెట్టిందంటా. ఆ సంఘటనను తలుచుకుంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. అన్నం గొప్పదనం, తినేటప్పుడు ఎవ్వరినీ ఏమీ అనకూడదంటూ తనలోని బాధనంతా వెల్లగక్కింది మాధవీలత. ఓ సారి ఆ కథ ఏంటో చూద్దాం.
అన్నం పరబ్రహ్మ స్వరూపం..
మనసులో మా ట అంటూ.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన భారతీయ సంసృతి నేర్పింది , ఎవరు భోజనం చేసేటపుడు కూడా , చిన్న మాటైనా సరే కోపం తో అరవడం , అనకూడని మాటలు అనడం లేదా మాట జారడం ఎటువంటి విషయం ఐన సరే జరగకూడదు అని మాధవీలత పేర్కొంది.
కన్నీళ్లు జారుతుంటే..
నా జీవితంలో నిన్న రాత్రి ఆకలితో అన్నం కలుపుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కొన్ని మాటలు (చిన్న మాటలే కానీ ) నా మనసుని కలచివేశాయి ,కంచం పక్కన పెట్టి లేచి కళ్ళలో నీళ్లు తురుగుతుండగా చేయి కడుకున్నాను రాత్రి 10 గంటల నుండి ఎంత ప్రయత్నం చేసి ఆపుకున్న కన్నీళ్లు ఇపుడు కళ్ళ నుండి జారుతుంటే చెప్పాలనిపించింది అంటూ తన బాధను అందరితో పంచుకుంది మాధవీలత.
కలలో కూడా..
ఎవరినైనా సరే అన్నం తింటుండగా కోపం పడవొద్దు నోరు జారొద్దు మాట అనొద్దు మాములుగా వేరు ....ఆకలి వేసిన వేయకున్నా తినడానికి కుర్చునేటపుడు తినేటపుడు వడ్డించేటపుడుకూడా ........ చెప్పాలి అనిపించింది ...... నా జీవితం లో కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా కంచం ముందు నుండి లేస్తాను అని కలలో కూడా అనుకోలేదు అని తనకు ఎదురైన అనుభవాన్ని మాధవీలత పేర్కొంది.
Recommended Video
కోటి విద్యలు కూటి కొరకే..
ఈ అనుభవం కూడా ఐంది అంతా మన మంచికే ..... మన భారతీయ సంసృతి లో మనకు ఎన్నో గొప్ప విషయాలు అందుకే నేర్పుతారు .... కోటి విద్యలు కూటి కొరకే కదా అంటూ మాధవీలత నిన్నరాత్రి జరిగిన సంఘటను వివరించింది. ఇక గత రెండ్రోజులు తన కరెంట్ బిల్లు విషయంలో మాధవీలత చేస్తోన్న పోరాటం, పోస్ట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.