Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖలో బిగ్ టర్న్ - ఏ పార్టీపై ఎఫెక్ట్..!!
- Finance Vodafone Idea: VI రూ.18,000 కోట్లు సమీకరణ.. సూపర్ రెస్పాన్స్.. షేర్ల పరిస్థితి ఇదే..
- Technology WhatsApp మరియు Instagram లో Meta Ai ని ఎలా ఉపయోగించాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- Sports KKR vs RR: కోహ్లీ, ధోనీలా ఆడి మ్యాచ్ గెలిపించాను: జోస్ బట్లర్
- Automobiles తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్లో మారుతి సుజుకి.. కారణాలివే.!!
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
అలాంటి అనుభవం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు.. కన్నీరు పెట్టుకున్న మాధవీలత
మాధవీలత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటూ ధైర్యాన్ని ప్రదర్శిస్తుందో అందరికీ తెలిసిందే. ఎలాంటి విమర్శలనైనా, ఎలాంటి కామెంట్లకైనా సరే ధీటుగా సమాధానమిస్తుంటుంది. అలాంటి మాధవీలత నిన్న రాత్రి కంటతడి పెట్టిందంటా. ఆ సంఘటనను తలుచుకుంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. అన్నం గొప్పదనం, తినేటప్పుడు ఎవ్వరినీ ఏమీ అనకూడదంటూ తనలోని బాధనంతా వెల్లగక్కింది మాధవీలత. ఓ సారి ఆ కథ ఏంటో చూద్దాం.
అన్నం పరబ్రహ్మ స్వరూపం..
మనసులో మా ట అంటూ.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన భారతీయ సంసృతి నేర్పింది , ఎవరు భోజనం చేసేటపుడు కూడా , చిన్న మాటైనా సరే కోపం తో అరవడం , అనకూడని మాటలు అనడం లేదా మాట జారడం ఎటువంటి విషయం ఐన సరే జరగకూడదు అని మాధవీలత పేర్కొంది.
కన్నీళ్లు జారుతుంటే..
నా జీవితంలో నిన్న రాత్రి ఆకలితో అన్నం కలుపుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కొన్ని మాటలు (చిన్న మాటలే కానీ ) నా మనసుని కలచివేశాయి ,కంచం పక్కన పెట్టి లేచి కళ్ళలో నీళ్లు తురుగుతుండగా చేయి కడుకున్నాను రాత్రి 10 గంటల నుండి ఎంత ప్రయత్నం చేసి ఆపుకున్న కన్నీళ్లు ఇపుడు కళ్ళ నుండి జారుతుంటే చెప్పాలనిపించింది అంటూ తన బాధను అందరితో పంచుకుంది మాధవీలత.
కలలో కూడా..
ఎవరినైనా సరే అన్నం తింటుండగా కోపం పడవొద్దు నోరు జారొద్దు మాట అనొద్దు మాములుగా వేరు ....ఆకలి వేసిన వేయకున్నా తినడానికి కుర్చునేటపుడు తినేటపుడు వడ్డించేటపుడుకూడా ........ చెప్పాలి అనిపించింది ...... నా జీవితం లో కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా కంచం ముందు నుండి లేస్తాను అని కలలో కూడా అనుకోలేదు అని తనకు ఎదురైన అనుభవాన్ని మాధవీలత పేర్కొంది.
Recommended Video
కోటి విద్యలు కూటి కొరకే..
ఈ అనుభవం కూడా ఐంది అంతా మన మంచికే ..... మన భారతీయ సంసృతి లో మనకు ఎన్నో గొప్ప విషయాలు అందుకే నేర్పుతారు .... కోటి విద్యలు కూటి కొరకే కదా అంటూ మాధవీలత నిన్నరాత్రి జరిగిన సంఘటను వివరించింది. ఇక గత రెండ్రోజులు తన కరెంట్ బిల్లు విషయంలో మాధవీలత చేస్తోన్న పోరాటం, పోస్ట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.