Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంతమంది దరిద్రులున్నారో.. దేశాన్ని పాలించే ఆయనకు మొక్కాలి.. మాధవీలత ఫైర్
మాధవీలత తాజాగా ఓ పోరాటాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కరెంటు బిల్లుల్లో తప్పులను ఎత్తి చూపెడుతూ తన పోరాటాన్ని ప్రారంభించింది. లాక్డౌన్లో కొందరు సెలెబ్రిటీలు కరెంటు బిల్లులను చూసి షాక్ అయ్యారు. కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా ఇదే సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల బిల్లులు ఒకేసారి కొట్టడం, అందులో ఎన్నో తప్పులు రావడంతో పూరి గుడిసెలో ఉన్నవారికి సైతం వేలల్లో బిల్లు వచ్చింది. తాజాగా మాధవీలత తన కరెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మళ్లీ కట్టించుకున్నారట..
మాధవీలతకు రూ. 7500 కరెంట్ బిల్ వచ్చిందట. దాన్ని ఎయిర్టెల్ యాప్ ద్వారా పే చేసిందట. మళ్లీ కట్టాలని బిల్ చూపడంతో మళ్లీ పే చేసిందట. అయితే తన డబ్బులు ఎవరు తిన్నారు? ఎటు పోయాయ్ అంటూ తన బ్యాంక్, ఎయిర్టెల్, విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేటీఆర్, కేసీఆర్ను ప్రశ్నించింది. ఈ మేరకు మాధవీలత చేసిన పోస్ట్పై కొందరు ఫైర్ అయ్యారు.
నెగెటివ్ కామెంట్స్..
ఇలా తన డబ్బులు తనకు చెల్లించాల్సిందేనని పోస్ట్ పెట్టడంతో మాధవీలతపై కొందరు ట్రోలింగ్ చేశారు. మాధవీలతను నెగెటివ్ కామెంట్లతో దూషించారు. న్యాయం అడిగితే కూడా ఇలా తనపై నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేయడంపై మాధవీలత సెటైర్ వేసింది.
మింగి కూర్చుని..
ఇది నా ఒక్కదాని సమస్య కాదే ప్రజల సమస్య. ఇది అడిగితే నా వాల్లో ఇంతమందికి కాలింది. అంటే వీళ్లందరూ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు, అమ్మా నాన్న పెడుతుంటే మింగి కూర్చుని ఇంత ఖాళీగా ఉన్నారు. అసలు పవర్ బిల్ కట్టే విషయంలో పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో తెలియని వాళ్లే సగం.. ఉద్దెర సొమ్ము తినేవాళ్లు సగం అంటూ మాధవీలత కౌంటర్ వేసింది.
Recommended Video
నా పైసల్ నాకు కావాలి..
కర్మరా నాయనా.. ఈ దేశాన్ని పాలించే ఆయనకు మొక్కాలి ఇంత దరిద్రులున్నారి ఉఫ్.. ప్రజల సమస్య అడిగితే కూడా ఇంతమందికి మండింది అంటే.. ఎంత బేవార్స్గాల్లు ఉన్నారో.. అర్థమైంది. ఐనా సరే నా పైసల్ నాకు కావాలి'అని చెప్పుకొచ్చింది. మరి మాధవీలత డబ్బులు ఎక్కడికి పోయాయ్? ఎవరి చెల్లిస్తారో? చూడాలి.