twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ సినిమాలో మధుశాలిని

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు నటి మధుశాలిని చాలా కాలం తర్వాత ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ 'గోపాలా గోపాలా'లో కీలకమైన పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది. ఇందులో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.

    పాత్ర చిన్నదే అయినా సినిమాకి మాత్రం చాలా కీలకమని చిత్రబృందం అంటోంది. ప్రస్తుతం మధుశాలినికి సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు.

    Madhu Shalini in Pawan Kalyan Movie

    ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.

    హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్ పోషించిన గోపాలుడి పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పోషించిన వ్యాపారి పాత్రను వెంకటేష్ తెలుగులో చేస్తున్నారు. 'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

    English summary
    Telugu Girl, Telugu Actress Madhu Shalini is the latest addition to the cast of Pawan Kalyan – Venkatesh starrer Gopala Gopala. The Hyderabadi actress, we hear has joined the sets of the film in the city on Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X