ఉదయభాను ‘మధుమతి’ ఆడియోలాంచ్(ఫోటోలు)
హైదరాబాద్ : పాపులర్ యాంకర్ ఉదయభాను టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం 'మధుమతి'. విష్ణు ప్రియన్, దీక్షాపంథ్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో గోమాతాఆర్ట్స్ పతాకంపై కడియం రమేష్ సమర్పణలో రాణీ శ్రీధర్ 'మధుమతి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి దీక్షాపంత్ కూడా పాల్గొన్నారు.
ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ, సంగీత దర్శకుడు రంఘు కుంచె హాజరైన సీడీలను ఆవిష్కరించారు. థియేట్రికల్ ట్రైలర్ను ఐఏఎస్ అధికారిణి కామాక్షి విడుదల చేసారు. రఘు కుంచె మాట్లాడుతూ రాజ్ శ్రీధర్ మంచి అభిరుచి కలిగిన వ్యక్తి. తన తొలి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, ఉదయభాను ఎంతో డెడికేషన్ ఉన్న నటి. ఈ టీంకు తప్పకుండా సక్సెస్ అందుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు.
ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం అందించారు. మైథిలి అనే పాత్రలో దీక్షా పంథ్ నటించింది. సీత, తెలంగాణ శకుంతల, ప్రభాస్ శ్రీను, ఆనంద్ భారతి, వేణు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా సత్య.వి.ప్రభాకర్, ఎడిటింగ్: మహేంద్రనాథ్.

మధుమతి
సమర్పకులు కడియ రమేష్ మాట్లాడుతూ...అండర్ వాటర్లో తీసిన సీన్లు చాలా బాగా వచ్చాయి. ఉదయభాను ఎంతో ధైర్యంగా ఈ సీన్లు చేసింది. కెమెరామెన్ వి.ప్రభాకర్ ఎంతో అద్భుతమైన పనితనం కనబర్చారు. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడి పని చేసారు. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు.

ఉదయభాను
ఈ చిత్రంలో ఉదయభాను విచ్చలవిడిగా తిరిగే అమ్మాయిగా నటిస్తోంది. మధుమతి షూటింగ్ పూర్తయి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఉదయభాను ఆశలు
ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుందని, సినిమాల్లో బిజీ అవుతాననే బోలెడు ఆశలు పెట్టుకుంది ఉదయభాను.

తారాగణం
ఉదయభాను, దీక్ష్, శివకుమార్, గౌతమ్, సీత, తెలంగాణ శకుంతల, ప్రభాస్ శ్రీను, కమెడియన్ వేణు, సతీష్, బస్టాప్ కోటేశ్వరరావు, నాగభైరవ అరుణ్ కుమార్ తదితరులు నటించారు.

టెక్నీషియన్స్
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ : సత్య వి.ప్రభాకర్, సంగీతం : రాజ్ కిరణ్, నిర్మాత: రాణి శ్రీధర్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : రాజ్ శ్రీధర్.


Click it and Unblock the Notifications











