'జైలు'కు వెళ్ళనున్న దర్శకుడు?

ఓ ఖైదీ పాయింట్ ఆఫ్ వ్యూ జైలు వాతావరణాన్ని ప్రదర్శిస్తానంటున్నాడు మధూర్. ఇక ఈ చిత్రం ఆలిస్టర్ పెర్రియార అనే వ్యక్తి జీవితం ఆధారంగా సాగుతుందని వార్తలు వినపడుతున్నాడు. అతను ముంబయిలో ఓ రాత్రి పేవ్ మెంట్స్ పై నిద్రపోతున్న లేబర్ పై కారు పోనిచ్చి ఎంతో మంది మరణానికి కారణమయ్యాడు. ఇక అప్పటివరకూ ఒక రకమైన జీవితాన్ని గడిపిన అతను హఠాత్తుగా అతను జైలు పాలవటాన్ని జీర్ణించుకోలేకపోతాడు.
ఫెర్సపెక్ట్ పిక్చర్స్ కంపెనీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారే ఈ విషయాన్ని మీడియా వద్ద నిర్దారించారు. అయితే మధూర్ ఈ విషయం పై కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. ఓ పదిహేను రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడిస్తానంటున్నాడు.ఇక గతంలో మధూర్ పేజ్ త్రి,కార్పోరేట్,చాందినీ బార్,ట్రాఫిక్ సిగ్నల్ వంటి చిత్రాలను రూపొందించి అంతులేని పేరు సంపాదించాడు.


Click it and Unblock the Notifications











