Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మధుర శ్రీధర్ కొత్త చిత్రం "నేను సచిన్ కాదు''
మధుర శ్రీధర్ మాట్లాడుతూ... ప్రస్తుతం యువతరం ఆదరిస్తున్న 20-20 క్రికెట్ మ్యాచ్ లో అత్యున్నత ప్రదర్శనతో హీరోగా ఎదిగి, డబ్బు మరియు గ్లామర్ పై వ్యామోహంతో బెట్టింగ్ ఊడిలో చిక్కుకుని జీరో అయినన ఓ మధ్య తరగతి కుర్రాడి కథ ఇది. మానవ సంబంధాలతో ప్రేమ, నమ్మకం, నైతిక విలువల ప్రాధాన్యత ను తెలిపే విధంగా ఈ చిత్రం ఉంటుంది. బివిఎస్.ప్రకాష్ రచన చేస్తున్నారు,. ఈ చిత్రం నటీ నటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాము అన్నారు.
మరో ప్రక్క ఆయన వీర్యదాత పాత్రకు సరిపోయే పర్ ఫెక్ట్ హీరో కోసం ఎదురు చూస్తున్నారు. హిందీలో మంచి విజయం సాధించిన ఆయుష్మాన్ ఖురానా నటించని 'వికీ డోనర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వీర్యం దానం చేసే ఓ వ్యక్తి కథ ఈ మూవీ. దాదాపు సంవత్సరం తర్వాత మధుర శ్రీధర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు. సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, అయితే కథకు సరిపోయే కథానాయకుడు దొరకడం లేదని అంటున్నాడు మధుర్ శ్రీధర్. త్వరలోనే సబ్జెక్టుకు సూటయ్యే హీరోను వెతికి పట్టుకుంటానంటున్నాడు.
గతంలో ఈచిత్రం కోసం మధుర శ్రీధర్ హీరో నానిని సంప్రదించాడు. అయితే నాని బ్యాండ్ బాజా భారత్, జెండాపై కపిరాజు చిత్రాలతో బిజీగా ఉండటంతో హీరో రానాతో ఈచిత్రం చేయాలనుకున్నాడు. అయితే రానా కూడా రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో బిజీగా ఉండటంతో కుదరదనిచెప్పాడు. ప్రస్తుతం మధుర శ్రీధర్ కన్ను బస్టాప్, నీకు నాకు చిత్రాల హీరో ప్రిన్స్పై పడింది. ఈచిత్రం కోసం కొన్ని కిలోల బరువు తగ్గాలని సూచించాడట. అయితే ప్రిన్స్ కూడా ఈ ప్రాజెక్టుకు ఫైనల్ కాలేదని తెలుస్తోంది. దీంతో కొత్త వారితోనే సినిమా చేయాలని నిర్ణయించినట్లు మధుర శ్రీధర్ వెల్లడించారు.