twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గజనీ'పై నిషేధం ఎత్తివేత

    By Staff
    |

    Ghajini
    అమీర్‌ ఖాన్‌ హీరోగా గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ హిందీలో నిర్మించిన 'గజని' చిత్రం విడుదలపై నిషేధాన్ని మద్రాసు హైకోర్టు ఎత్తివేసింది .దాంతో తమిళనాడు లోనూ రిలీజుకు ఇబ్బంది లేకుండా పోయింది.దాంతో నిర్మాత,హీరోలకు ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఇక ఈ సినిమా రీమేక్‌, అనువాద హక్కులను పొందకుండానే ఈ సినిమాను హిందీలో నిర్మించారంటూ తమిళ నిర్మాత ఏ.చంద్రశేఖర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించిన సంగతి తెలిసిందే.

    చంద్రశేఖర్‌ తన పిటిషన్‌లో తమిళంలో వచ్చిన గజిని చెన్నై పంపిణీ హక్కులు, తెలుగు పునర్నిర్మాణ హక్కులు, శాటిలైట్‌ ఛానెల్‌ హక్కులు తప్ప చిత్రం కథ, డబ్బింగ్‌పై తనకే పూర్తి అధికారం ఉందని సవాల్ చేస్తూ పిటీషన్ ధాకలు చేసారు. దాంతో రీమేక్‌ హక్కులు లేకుండా నిర్మించిన హిందీ 'గజని'ని విడుదల చేయకూడదంటూ న్యాయమూర్తి పీఆర్‌ శివకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

    దీంతో ఆ చిత్ర వర్గాలు ద్రిగ్భాంతి చెందాయి. గీతా ఆర్ట్స్‌ అప్పీలు మేరకు ఈ కేసుపై బుధవారం మళ్లీ విచారణ జరిగింది. గనుంది. ముంబైలో కేబీసీ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లేల కాపీరైట్‌ను తాము సొంతం చేసుకున్నామంటూ గీతాఆర్ట్స్‌పై బాంబే హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇది శుక్రవారంకు వాయిదా పడింది.

    మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మార్కెట్‌ జరిగిన అమీర్‌ఖాన్‌ తొలి చిత్రమిదని సినీ వర్గాల కథనం. డ్రిస్టిబ్యూషన్‌ హక్కులను బాలీవుడ్‌కు చెందిన ఎరోస్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఇది తమిళంలో సూర్య కథానాయకుడిగా విడుదలైన 'గజని' రీమేక్‌ వర్షన్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న గజనీ చిత్రం క్రిస్మస్‌ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి వుంది. ఇక ఈ గజనీ చిత్రం హాలీవుడ్ చిత్రం 'మొమెంటో' నుంచి ప్రేరణ పొందినది అన్న సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X