'మగధీర' అక్కడ 700 రోజులు పూర్తి
'మగధీర' చిత్రం కర్నూల్ టౌన్ లో ఏడు వందల రోజులు పూర్తి చేసుకుంది. గతంలో పోకిరి చిత్రం అక్కడ ఐదు వందల రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు దాన్ని ఈ చిత్రం బ్రద్దలు కొట్టింది. ఇక ఈ రికార్డును బ్రద్దలు కొట్టే ఇప్పుడిప్పుడే ఏమీ వచ్చేటట్లు కనపడటం లేదంటున్నారు. ఇక మగధీర చిత్రాన్ని రాజమౌళి డైరక్ట్ చేయగా, భారీ ఖర్చుతో అల్లు అరవింద్ నిర్మించారు. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. నాలుగు వందల సంవత్సరాల కథను ఇప్పటి పరిస్ధితులకు ముడిపెడుతూ అల్లిన ఈ ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది. ఇందలో చిరంజీవి...బంగారు కోడి పెట్ట పాటలో తన కుమారుడుతో పాటు డాన్స్ చేసారు.


Click it and Unblock the Notifications











