Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ యుద్దం "మెగాస్టార్" చేయాల్సింది: మగధీర రహస్యాన్ని చెప్పిన విజయేంద్ర ప్రసాద్
మగధీరలో ఉన్న 100 యోధులతో కాలభైరవుడు చేసే ఫైట్ సీన్ అసలు ఆ సినిమా కోస రాసిందే కాదట, అది చిరంజీవి కోసం రాసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్.
'శ్రీవల్లీ' ప్రి రిలీజ్ ఈవెంట్కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చిన నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడూ, స్టార్ సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ అతడి గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. మగధీరలో ఉన్న 100 యోధులతో కాలభైరవుడు చేసే ఫైట్ సీన్ అసలు ఆ సినిమా కోస రాసిందే కాదట, అది చిరంజీవి కోసం రాసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్. అయితే అప్పటికి అవకాశం రాక, తర్వాత సినిమాలకు చిరూ దూరమైపోవటం తో ఆ సీన్ ని "మగధీర" కోసం వాడేసారు. అసలు ఆ సీన్ సినిమా హైలేట్స్ లో ఒకటిగా నిలిచింది.
''సింహాద్రి సినిమా సూపర్ హిట్టయ్యాక మీడియా వాళ్లు రాజమౌళిని.. చిరంజీవితో సినిమా చేయరా అని అడిగారు. దానికి బదులిస్తూ.. చిరంజీవితో నేను సినిమా చేయడమేంటి.. ఆయన వరమివ్వాలి కానీ.. తెలుగులో ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేసి తీరాలని కోరుకునే దర్శకుడు చిరంజీవి గారే అని చెప్పాడు. ఆ తర్వాత చిరంజీవి గారిని కలిసే అవకాశం నాకు, రాజమౌళికి వచ్చింది.
ఆయన తనతో సినిమా చేయమని అడిగారు. మహాభాగ్యం అనుకుని వెళ్లి 'మగధీర'లో వచ్చే 100 మందితో హీరో ఫైట్ ఎపిసోడ్ రాసుకుని వెళ్లి ఆయనకు చెప్పాం. ఆయనకు బాగా నచ్చింది. దాని ఆధారంగా సినిమా చేద్దామన్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆయనతో సినిమా చేయడం కుదర్లేదు. తర్వాత అనుకోకుండా చరణ్తో 'మగధీర' చేశాం. ఆ సినిమాకు ఆ సీన్ వాడుకున్నాం'' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మొత్తానికి అంత ఇంపాక్ట్ చూపించిన సీన్ ఎవరికి చేరాలో వాళ్ళకే చెందింది.