Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ యుద్దం "మెగాస్టార్" చేయాల్సింది: మగధీర రహస్యాన్ని చెప్పిన విజయేంద్ర ప్రసాద్
మగధీరలో ఉన్న 100 యోధులతో కాలభైరవుడు చేసే ఫైట్ సీన్ అసలు ఆ సినిమా కోస రాసిందే కాదట, అది చిరంజీవి కోసం రాసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్.
'శ్రీవల్లీ' ప్రి రిలీజ్ ఈవెంట్కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చిన నేపథ్యంలో ఆ సినిమా దర్శకుడూ, స్టార్ సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ అతడి గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. మగధీరలో ఉన్న 100 యోధులతో కాలభైరవుడు చేసే ఫైట్ సీన్ అసలు ఆ సినిమా కోస రాసిందే కాదట, అది చిరంజీవి కోసం రాసుకున్నాడట విజయేంద్ర ప్రసాద్. అయితే అప్పటికి అవకాశం రాక, తర్వాత సినిమాలకు చిరూ దూరమైపోవటం తో ఆ సీన్ ని "మగధీర" కోసం వాడేసారు. అసలు ఆ సీన్ సినిమా హైలేట్స్ లో ఒకటిగా నిలిచింది.
''సింహాద్రి సినిమా సూపర్ హిట్టయ్యాక మీడియా వాళ్లు రాజమౌళిని.. చిరంజీవితో సినిమా చేయరా అని అడిగారు. దానికి బదులిస్తూ.. చిరంజీవితో నేను సినిమా చేయడమేంటి.. ఆయన వరమివ్వాలి కానీ.. తెలుగులో ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేసి తీరాలని కోరుకునే దర్శకుడు చిరంజీవి గారే అని చెప్పాడు. ఆ తర్వాత చిరంజీవి గారిని కలిసే అవకాశం నాకు, రాజమౌళికి వచ్చింది.
ఆయన తనతో సినిమా చేయమని అడిగారు. మహాభాగ్యం అనుకుని వెళ్లి 'మగధీర'లో వచ్చే 100 మందితో హీరో ఫైట్ ఎపిసోడ్ రాసుకుని వెళ్లి ఆయనకు చెప్పాం. ఆయనకు బాగా నచ్చింది. దాని ఆధారంగా సినిమా చేద్దామన్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆయనతో సినిమా చేయడం కుదర్లేదు. తర్వాత అనుకోకుండా చరణ్తో 'మగధీర' చేశాం. ఆ సినిమాకు ఆ సీన్ వాడుకున్నాం'' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మొత్తానికి అంత ఇంపాక్ట్ చూపించిన సీన్ ఎవరికి చేరాలో వాళ్ళకే చెందింది.