Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కర్ణాటకలో మగధీరకు చుక్కెదురు
కర్ణాటకలో 'మగధీర" సినిమా విడుదలను నిలిపేస్తూ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షురాలు జయమాల తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని కన్నడ నిర్మాతలు విమర్శించారు. అందుకు బాధ్యత వహించి ఆమె రాజీనామా చేయాలంటూ కన్నడ సినిమా నిర్మాతలు మంగళవారం ఉదయం దర్నా చేశారు. ఈ సినిమా విడుదల ద్వారా కన్నడ సినిమాల విడుదలకు ఆటంకం కలిగి చాలా నష్టం వస్తోందటున్నారు. మగధీరపై చర్యలు తీసుకోకపోవడం వల్ల కన్నడ సినీవర్గానికి అన్యాయం జరుగుతోందని నిర్మాత మణిరత్నం ఆరోపించారు. నియమాల ప్రకారమే సినిమాను విడుదల చేయాలని కర్ణాటక నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి జో సైమన్ డిమాండ్ చేశారు. ఆంధ్రరాష్ట్రంలో విడుదలైన ఏడు వారాల తర్వాత తెలుగు చిత్రాలను కర్ణాటకలో విడుదల చేయాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి కోశాధికారి సా.ర. గోవింద్ అన్నారు.
పర భాషా చిత్రాలను విడుదల చేయడానికి ఆ చిత్రాల నిర్మాతలు కర్ణాటక వాణిజ్య చలనచిత్ర మండలిలో సభ్యులై వుండాలి, ఈ అనుమతితోనే పరభాషా చిత్రాలను విడుదల చేయాలి, ఈ నిబంధనలకు సినిమా థియేటర్ల ఓనర్లు, డిష్ట్రిబ్యూటర్లు సహకరించాలన్నారు. పరభాషా చిత్రాల హక్కులను రాష్ట్రంమంతా ఒకే సారి కొనాలని డిమాండ్ చేశారు. 'మగధీర" కర్ణాటక హక్కులని విజయ్ కుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఇతను కర్ణాటక వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు 'జల్సా" సినిమా కర్ణాటక హక్కులని విజయ్ కుమారే కొనుగోలు చేశారు. జల్సా మగధీర సినిమాలు నియమాలు ఉల్లంఘించి విడుదల చేశారని విమర్శలు రావడంతో వాణిజ్య మండలి నుండి విజయ్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఒక నెలలోపల తమ డిమాండ్ లను తీర్చకపోతే పోరాటం తీవ్రంగా వుంటుందని కన్నడ సినిమా నిర్మాతలు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ ధర్నాలో కన్నడ నిర్మాతలు కె.సి.యన్. చంద్రశేఖర్, రాజేంద్ర సింగ్ బాబు, జె.జగదీష్, ఉమేష్, బసంతకుమార్ పాటిల్, రాము, హరీష్ తదితరులు పాల్గొన్నారు.