మగధీర..రామ్ చరణ్ కి పాలాభిషేకం
మగధీర చిత్రం విజయవంతంగా వంద రోజులు పూర్త చేసుకోవటంతో రామ్ చరణ్,చిరు అబిమానుల్లో ఆనందం తారా స్ధాయిలో కనిపిస్తోంది. రాష్ట్రంలోని చాలా ధియోటర్ల వద్ద రామ్ చరణ్ హోర్డింగ్స్ కు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.మరో ప్రక్క బాణా సంచా పేలుస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తూ హంగామా వాతావరణాన్ని క్రియోట్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ అంటూ రామ్ చరణ్ ని కీర్తిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి వంద రోజులు అయిన సందర్భంగా కొన్ని ధియోటర్స్ లో పాటలును రిపీట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమాల్లో యువత మాత్రమే కాక చిరంజీవి అభిమానాల సంఘాల సీనియర్ నాయకులు కూడా పాల్గొని మరింత ఊపును తెస్తున్నారు. రాజమౌళికి సైతం డిస్ట్రిబ్యూటర్స్స,ధియోటర్ యాజమాన్యాల నుంచీ వరసగా అబినందనలు ఫోన్స్ వస్తున్నాయి. ఇక ఈ విజయోత్సాహాన్ని భారీగా సెలబ్రేట్ చేయటానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











