Don't Miss!
- Finance Google Layoffs: ఉద్యోగులను మళ్లీ తగ్గించిన గూగుల్.. భారతీయ టెక్కీలపై భారీ ప్రభావం..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
దాసరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’
తాజాగా దాసరి నారాయణరావు తన డ్రీమ్ ప్రాజెక్టు వివరాలను ప్రకటించారు. 'మహాభారతం' సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని, ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కూడా పూర్తయిందని, తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభిస్తానని తెలిపారాయన.
'ఆరు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు గత నెలలోనే ప్రకటించాను. పొలిటికల్ సెటైరిక్ మూవీ 'వడ్డికాసులవాడు' త్వరలోనే కంప్లీట్ చేస్తాను. ప్రస్తుతం ప్రారభించిన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభిస్తాను. దానికి స్క్రిప్టు వర్కు రెండు సంవత్సరాల క్రితమే కంప్లీట్ చేసాను' అని వెల్లడించారు దాసరి.
తన డ్రీమ్ ప్రాజెక్టను దాసరి వివిధ భాషల్లో రూపొందించాలని భావిస్తున్నారు. దాన్ని ఇంగ్లీష్లోకి అనువదిస్తే....అంతర్జాతీయంగా మన భారతీయ ఇతిహాస సినిమాకు మంచి గుర్తింపు వస్తుందని అంటున్న దాసరి, ఆ మేరకు తన ప్రయత్నాలు సాగుతాయని వెల్లడించారు.
వడ్డికాసులవాడు ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈచిత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ అవినీతి ప్రస్పుటించేలా ఉంటుందని, దాసరి నారాయణరావు వైఎస్ఆర్ వ్యక్తిగత అనుచరుడు సూరీడు రోల్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. గతంలో దాసరి నారాయణరావు చిరంజీవిపై సెటైర్గా 'మేస్త్రి' అనే చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసింతే. తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దాసరి 'వడ్డి కాసులవాడు' చిత్రాన్ని రూపొందిస్తుండం సర్వత్రా చర్చనీయాంశం అయింది. 2014 ఎన్నికల నాటికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
దీంతో పాటు ఓ మూడు సినిమాలను తన సొంత బ్యానర్పై నిర్మించబోతున్నట్లు దాసరి తెలిపారు. ఈ చిత్రంలో ఒకదానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించనుండగా, మరో చిత్రానికి సురేష్ కృష్ణ, మూడో చిత్రం ద్వారా కోడైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసిన రవి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
వీటి తర్వాత మంచు విష్ణు హీరోగా మరో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు దాసరి. ఈచిత్రాన్ని మోహన్ బాబు, రమేష్ వడ్డె సంయుక్తంగా నిర్మించనున్నారు. వీటి తర్వాత ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు దాసరి తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.