Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహానటి ఆడియో లంచ్ లైవ్ అప్డేట్స్: 8 నెలల పిల్లాడిని.. ఆమెని ప్రేమించే వాడినెమో!
భారతీయ చలన చిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబందించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక నేడు జరగబోతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవర కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆడియో వేడుక ప్రారంభమైంది.
Recommended Video
ఆమెని ప్రేమించే వాడిని
వేదికపైకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ చాలా సరదాగా మాట్లాడాడు. సావిత్రి గురించి నేను చెప్పేదేముంది.. ఆమె మహా నటి. సావిత్రి గారు ఏ సమయంలో ఉండి ఉంటె ఆమె ప్రేమలో పడేవాడిని అని విజయ్ దేవరకొండ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ చిత్రంలో జెమినీగణేశన్ పాత్ర చూసి తీరాల్సిందే అని విజయ్ దేవరకొండ తెలిపాడు.
మహానటి ఒక్కరే, రెండు ఎవరెస్టులు లేవు
ఈ చిత్రానికి దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ఆయన మాట్లాడుతూ మహానటి అంటే సావిత్రి మాత్రమే అని అన్నారు. రెండు ఎవరెస్టులు ఉండవు. సావిత్రి గారి జీవితం 75 శాతం నటిగానే సాగిందని ఆయన అన్నారు. సావిత్రి గారి జీవితం తెరచిన పుస్తకం. ఇలాంటి చిత్రాన్ని తీయాలంటే కత్తిమీద సాము లాంటి పని. ఆ పనిని నాగ అశ్విన్ అద్భుతంగా నెరవేర్చారని అన్నారు. సావిత్రి జీవితం విషాదాంతం అంటే తాను ఒప్పుకోనని అన్నారు. సావిత్రి చనిపోవాలి అంటే మనం మాయాబజార్, కన్యాశుల్కం వంటి చిత్రాలని మర్చిపోవాలి అని అన్నారు.
8 నెలల పిల్లాడిని, సావిత్రి గారు నన్ను ఎత్తుకున్నారు
8 నెలల పిల్లాడిగా ఉన్న సమయంలో సావిత్రిగారు నన్ను ఎత్తుకుని వెలుగు నీడలు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసారని నాగార్జున అన్నారు. బహుశా ఆమె చేతి చలవవలనేనెనో నేనుకూడా ఓ స్టార్ కాగలిగా. ఒక మహిళపై తెలుగులో వస్తున్న తొలి బయోపిక్ చిత్రం ఇదే అని నాగార్జున అన్నారు. ఈ చిత్రానికి 20 మంది ఆడపిల్లలు పనిచేశారని విన్నానని చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు. ఈ చిత్రంలో నా కోడలు సమంత, నాగచైతన్య నటిస్తున్నారు. ఇంకా చాలా మంది నటిస్తున్నారు. వారందరిని చూస్తుంటే అసూయగా ఉందని నాగార్జున అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
వారికి పెద్ద అభిమానిని
అందరికి నమస్కారం అంటూ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని దుల్కర్ తెలిపారు. తాను సావిత్రి, జెమినీ గణేషన్ కు పెద్ద అభిమానిని అని దుల్కర్ తెలిపాడు.
నాకు ఆ విషయం చెప్పలేదు, బాధపడ్డా
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. సావిత్రి బయోపిక్ చేస్తున్నాని నాగ అశ్విన్ తనకు చెప్పలేదని అందుకు తాను చాలా భాదపడ్డానని అన్నారు. తన జీవితం ప్రారంభమైందే సావిత్రి గారితో అని రాఘవేంద్ర రావు అన్నారు. పాండవ వనవాసం చిత్రానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.