Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహానటి చిత్రంలో వారి పాత్రలే హైలైట్. ఆడియన్స్ థ్రిల్ అవ్వడం ఖాయం!
'మహానటి' కథలో ముఖ్యమైన ఇతర పాత్రల కోసం కూడ పాపులర్ వ్యక్తుల్నే ఎంచుకున్నారు. సావిత్రిగారి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రిగారి సినీ జీవితంలో ముఖ్యులైన ప్రతి ఒక్కరిని సినిమాలో చూపించనున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
ఎస్విఆర్ పాత్రలో మోహన్ బాబు
ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు భారతీయ చలన చిత్ర చరిత్రకే మకుటాయమానం. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా పోషించగల నటుడు. సావిత్రికి ఎస్వీఆర్ మధ్య అత్యద్భుత స్నేహ సంబంధాలున్నాయి. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో మోహన్ బాబు ఎస్వీ ఆర్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మోహన్ బాబు ఎస్విఆర్ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నాడు.
|
కేవీ రెడ్డిగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి
మహానటి సినిమాలో ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి పాత్రలు ఎవరు చేస్తున్నారనే అనుమానాలు ఉండేవి, కాని తాజాగా చిత్ర యూనిట్ ఈ పాత్రలు ఎవరు చేస్తున్నారనేది పోస్టర్స్ ద్వారా తెలిపింది. ఆ పాత్రల్లో నటించే నటులను రివీల్ చేశారు. ఎల్వీ ప్రసాద్గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా దర్శకుడు క్రిష్ నటిస్తుండడం విశేషం.
|
అదే గుండెధైర్యంతో మద్రాసు తిరిగొచ్చి
తెలుగు సినీ పరిశ్రమలో నటించిన గొప్ప నటుల గురించి నాని వాయిస్ ఓవర్తో వీడియోలను తాజాగా రిలీజ్ చేసారు చిత్ర బృందం. ‘అనగనగా ఏలూరుకు చెందిన 22 ఏళ్ల కుర్రాడు. తొలి భారతీయ టాకీ ఆలం అరా, తొలి తెలుగు సినిమా ‘భక్తప్రహ్లాద'లోనూ నటించేశారు. అదే గుండెధైర్యంతో మద్రాసు తిరిగొచ్చి డైరెక్టర్ గా మనదేశం, షావుకారు, పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించిన దర్శకుడు మరెవరో కాదు ఆయనే ఎల్వీ ప్రసాద్ అని చెప్పడం జరిగింది.
|
సావిత్రి కోసం డైరెక్టర్ అశ్విన్
‘మహానటి' కథలో ముఖ్యమైన ఇతర పాత్రల కోసం కూడ పాపులర్ వ్యక్తుల్నే ఎంచుకున్నారు. ముఖ్యంగా.. మోహన్ బాబు, అవసరాల శ్రీనివాస్, క్రిష్ పాత్రలు హైలైట్ కాబోతున్నాయని సమాచారం. సావిత్రిగారి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రిగారి సినీ జీవితంలో ముఖ్యులైన ప్రతి ఒక్కరిని సినిమాలో చూపించనున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
అలా జరుగుతుందని అనుకోలేదు
మహానటి సినిమాలో నటిస్తోన్న నటుడు మోహన్ బాబు ఎస్వీఆర్ పాత్రలో కనిపించబోతున్న సందర్భంగా మోహన్ బాబు ఎస్వీఆర్ తో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. నా సినిమా షూటింగ్ లో ఆ మహానుభావుడ్ని కలుసుకున్నాను. ఇప్పుడు ఆయన పాత్రలో నేను నటిస్తానని అనుకోలేదని వెల్లడించాడు మోహన్ బాబు.