Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్య ఫ్యామిలీకోసం ‘మహానటి’ స్పెషల్ షో
ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం అద్భుతమైన టాక్తో బాక్సాఫీసు వద్ద సూపర్ ఫలితాలు సాధిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇదో గొప్ప బయోపిక్ అనే పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ అవ్వడంతో ప్రముఖులంతా ఈ చిత్రం చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'మహానటి' చిత్రాన్ని టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన బాలకృష్ణ తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూసినట్లు తెలుస్తోంది. ప్రసాద్ ల్యాబ్స్లో వీరి కోసం ఆదివారం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్ర కూడా ఇందులో ఉండటంతో బాలయ్య ఈ చిత్రాన్ని ఆసక్తిగా తిలకించారట.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం మే 9న విడుదలైంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం ముఖ్యమైన ఘట్టాలను ఫోకస్ చేస్తూ మహానటిగా ఆమె ఎలా ఎదిగారు, 45 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ఎలా ముగిసింది అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించారు.
స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. మోహన్ బాబు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రల్లో మెరిశారు.