Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మంచు లక్ష్మి వర్సెస్ జీవిత రాజశేఖర్!
హైదరాబాద్: ఈ మధ్య తరచూ ఏదో ఒక వివాదంతో జీవిత రాజశేఖర్ దంపతులు వార్తల్లో వ్యక్తులుగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు ఎలాంటి వివాదానికి తెరలేపక పోయినా మంచు లక్ష్మి ప్రసన్నతో ఢీ అంటే ఢీ నడానికి సిద్ధమయ్యారు. మంచు లక్ష్మి నిర్మాణంలో వస్తున్న 'గుండెల్లో గోదారి' చిత్రం, రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో రూపొందిన 'మహంకాళి' చిత్రం ఒకే రోజు బాక్సాఫీసు వద్ద బరిలోకి దిగి తలపడబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు మార్చి 8న విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
మహంకాళి సినిమా విశేషాల్లోకి వెళితే, అప్పుడెప్పుడో 2010 అక్టోబర్లో ప్రారంభమైన రాజశేఖర్ 'మహంకాళి' మూవీ దాదాపు రెండున్నరేళ్ల అనంతరం రిలీజ్కు సిద్ధమైంది. రాజశేఖర్ సరసన మధురిమ హీరోయిన్. నిర్మాతలు సురేందర్ రెడ్డి, పరంధామరెడ్డి. సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో ఈ చిత్రానికి కార్తికేయను దర్శకుడిగా నియమించారు. అయితే కొంత కాలం తర్వాత ఈ సినిమా నుంచి కార్తికేయ తప్పుకోవడంతో రాజశేఖర్ భార్య జీవిత ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
'నేటి సమకాలిన సంఘాలను కథా వస్తువుగా చేసుకుని తీసిన చిత్రమిది. మేము చిత్రీకరించిన కొన్ని సంఘటనలు సమాజంలో నిజంగానే జరిగాయి. పోలీసు పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ ఈచిత్రంలో కూడా తన పాత్రకు జీవం పోసారు' అని దర్శకురాలు జీవిత తెలిపారు.
గుండెల్లో గోదారి సినిమా వివరాల్లోకి వెళితే..ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం 'గుండెల్లో గోదారి'. నాగేంద్ర కుమార్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందించారు. కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రంలో చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు.