Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మనో భావాలు దెబ్బతీసారంటూ...సల్మాన్పై కేసు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్పై మరో కేసు నమోదైంది. ఈ సారి ఆయనపై మతం మనోభావాలు దెబ్బతీసారనే పిర్యాదులు రావడంతో మహారాష్ట్ర పోలీసులు ఆయనపై 295(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. ఆలిండియా క్వామీ తంజీమ్ విదర్భ యూనిట్ ప్రెసిడెంట్ అసిమ్ అలీ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్కు సంబంధించిన ఎన్జీవో ‘బీయింగ్ హ్యూమన్' సంస్థ కొన్ని నెలల క్రితం ముంబైలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో కొందరు మోడల్స్ ధరించిన గౌనుపై అరబిక్ బాషల్ ‘అల్లా' అని రాసి ఉందని, వారి చర్య ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అలీ తన కంప్లైంట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
\
అలీ తన కంప్లయింటుతో పాటు ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో క్లిప్ను కూడా జత చేసినట్లు తెలుస్తోంది. సదరు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని అలీ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవడం లేదని అలీ ఆరోపించారు. కంప్లైంట్ ఇచ్చి రెండు రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అలీ తెలిపారు. పోలీసులు డ్రామా ఆడుతున్నారని, రెండు రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే ఈ రోజు ఉదయం కేసు నమోదు చేసారని తెలిపారు. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దిలీప్ చవాన్ మాట్లాడుతూ...తాము సదరు కంప్లైంట్కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.