Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సూపర్ స్టార్ మహేష్ 26వ చిత్రం ఖరారు.. తిరుగులేని నిర్మాణ సంస్థ, బ్లాక్ బాస్టర్ దర్శకుడు!
మహెష్ నటించిన భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం దిశగా దూసుకునిపోతోంది. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు లుక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. భరత్ అనే నేను చిత్రానికి తొలి షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీనితో కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. మహేష్ బాబు తదుపరి చిత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మహేష్ బాబుకు 25 వ చిత్రం. కాగా మహేష్ బాబు 26 వ చిత్రం కూడా ఖరారయింది. ఈ వార్త మహెష్ ఫాన్స్ కు క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు.
Recommended Video
యంగ్ సీఎంగా అదరగొట్టాడు
భరత్ అనే నేను చిత్రం అభిమానుల అంచనాలు అందుకునే విధంగా ఉంటూ వారికీ వినోదాన్ని పంచుతోంది. దర్శకుడు కొరటాల శివ అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న మహేష్
భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ ఫోకస్ నెక్స్ట్ మూవీపై పడింది. వంశి పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయి. వంశి పైడి పల్లి దర్శకత్వం వహించబోయే చిత్రం మహేష్ కు 25 వ చిత్రం కావడం విశేషం.
మహేష్ 26 వ చిత్రం ఖరారు
ఇకపై మహెష్ గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూల్ లో గడపడానికి సిద్ధం అవుతున్నాడేమో. అందుకే 25 వ చిత్రం పార్రంభం కాక ముందే 26 వ చిత్రం కూడా ఖారైపోయింది. రంగస్థలం చిత్రంతో ఘనవిజయం అందుకున్న సుకుమార్ రెండవ సారి మహేష్ బాబుని డైరెక్ట్ చేయబోతున్నాడు.
తిరుగులేని నిర్మాణ సంస్థ
పరాజయమే ఎరుగని మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కాంబినేషన్ లో ఇటీవల రంగస్థలం చిత్రం విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
|
2019 లో విడుదల
మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ప్రకటన కూడా చేసారు. మైత్రి మూవీ మేకర్స్, మహెష్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రాన్ని 2019 లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు.