Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు - అనుష్కల గురించి జోష్యం!
టాలీవుడ్ యువరాజ్ మహేష్ బాబు, అందాల తార అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం తప్పకుండా బంపర్ హిట్ అవుతుందని సినీ పండితులు చెబుతున్నారు. కాగా ప్రిన్స్ మహేష్ బాబు, బిల్లా సుందరి అనుష్క జంటగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ పూణేలో జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూణే, మహారాష్ట్ర గ్రామ ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను సింగనమల రమేష్ బాబు కనకరత్న మూవీస్ పై నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి పాటల చిత్రీకరణ జరుగుతోందని శ్రీనివాస్ తెలిపారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎం. ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మాణ్యం, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు తెలియజేశారు.
అరుంధతి బంపర్ హిట్ తర్వాత అనుష్క నటించిన వేదం, పంచాక్షరి చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ చిత్రాలు అనుష్కకు మంచి గుర్తింపును తెచ్చిపెడతాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు సరసన అనుష్క నటిస్తోన్న తాజా చిత్రం కూడా బంపర్ హిట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. అలాగే 'అతడు" తర్వాత అనుష్క-మహేష్ బాబుల బ్లాక్ బస్టర్ మూవీ కోసం అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు.