Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పూరి దర్శకత్వంలో మహేష్ బాబు మరోసారి!
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'పోకిరి' చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన 'బిజినెస్ మేన్' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.....పూరి-మహేష్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, పూరి సినిమా కోసం మహేష్ బాబు 60 కోజుల కాల్షీట్ కూడా ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో మహేష్ పలు యాడ్ ఫిల్మ్స్ షూటింగుల్లో బిజీగా గడపనున్నాడు ఆ తర్వాత సుకుమార్ తో సినిమా పూర్తి చేసి, అనంతరం పూరి జగన్నాథ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు.
ఇక పూరి జగన్నాథ్ విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'ఇద్దరమ్మాయిలతో' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమల పాల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.