Just In
- 28 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్, నమ్రత పెళ్లికి 15 ఏళ్లు.. సూపర్స్టార్ ప్రేమ ఎలా.. ఎక్కడ మొదలైందో తెలుసా?
టాలీవుడ్లో స్టార్ దంపతులు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒకప్పటి అందాల తార నమ్రతా శిరోద్కర్. వంశీ చిత్ర షూటింగ్లో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏడడుగులు నడిచేలా చేసింది. ఆ తర్వాత వారిద్దరూ సంపూర్ణ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండటం తెలిసిందే. మహేష్, నమ్రత దంపతుల జీవితంలోకి ఓసారి తొంగి చూస్తే...

వంశీ చిత్ర షూటింగ్లో పీకల్లోతు
ప్రిన్స్ మహేష్, నమ్రత ఇద్దరూ వంశీ చిత్రం నుంచి పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. దాదాపు వారి ప్రేమ 4 సంవత్సరాలుపాటు సాగింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వారిద్దరు 2005లో ఫిబ్రవరి 10న వివాహం చేసుకొన్నారు. ప్రస్తుతం వారిద్దరి దాంపత్య జీవితానికి సుమారు 15 ఏళ్లు నిండటం విశేషం. గత దశాబ్దానికి పైగా జీవితంలో గౌతమ్, సితారా అనే ఇద్దరు సంతానం ఉన్నారు.
|
పెళ్లి తర్వాత నమ్రత నటనకు దూరం
మహేష్తో పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా నటనకు స్వస్తి చెప్పారు. మహేష్ను కంటికి రెప్పలా చూసుకొంటూ ఆయన కెరీర్ను చక్కదిద్దే పనిలో మునిగిపోయారు. మహేష్ యాడ్స్ ఎండార్స్మెంట్స్ను చూసే బాధ్యతను ఎత్తుకొన్నారు. అలాగే బిజినెస్ వ్యవహారాలను పక్కాగా చూసుకుంటూ మహేష్ కెరీర్ను మరో లెవెల్కు తీసుకెళ్లే పనిలో పడ్డారు.

1993లో మిస్ ఇండియాగా
నమ్రత శిరోద్కర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1993లో మిస్ ఇండియా బ్యూటీ టైటిల్ను గెలుచుకొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అంజి చిత్రంలో చిరంజీవి సరసన నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన చివరి చిత్రం బ్రైడ్ అండ్ ప్రిజ్యుడిస్ 2004లో రిలీజ్ అయింది.

వరుస విజయాలతో మహేష్ బాబు
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. వరుస విజయాలతో టాలీవుడ్లో ముందుకెళ్తున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో సరికొత్త కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకొన్నాడు. తాజాగా ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.220 కోట్లతో మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.