Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ పైన మండిపడుతున్న మహేష్ బాబు!?
మహేష్ తన తాజా చిత్రం దూకుడు హడావిడిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరో ప్రక్క మహేష్ కి పోటీగా అన్నట్లు ఎన్టీఆర్ కూడా ఊసరవల్లి చిత్రాన్ని జెట్ స్పీడుతో లాగిస్తున్నాడు. దాంతో తనతో పోటీకి కావాలనే దిగుతున్నట్లుగా మహేష్ భావిస్తున్నాడుట. తన ఖలేజా చిత్రం సమయంలోనూ బృందావనం విడుదల చేసి తన కలెక్షన్స్ కు గండి కొట్టి హిట్ టాక్ తెచ్చుకున్నాడని,ఇప్పుడు మళ్ళీ తనతో కాంపిటేషన్ కి దిగుతున్నాడుని భావిస్తున్నాడట. ఇంకా ఆడియో కూడా విడుదల కానీ ఊసరవిల్లి చిత్రాన్ని అక్టోబర్ 6 న ఎట్టి పరిస్ధితుల్లోనూ విడుదల చేయాలని చూస్తున్నాడు.
అందుకోసం బోయపాటి శ్రీను తో చేస్తున్న చురకత్తి చిత్రాన్ని సైతం ప్రక్కన పెట్టి మరీ ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దాంతో తన దూకుడు చిత్రాన్ని అంతకు ముందే అంటే సెప్టెంబర్ 23న విడుదల చేయాల్సిన పరిస్ధితి ఏర్డడుతోంది. అసలే కూల్ గా చేసుకుంటూ వెళ్ళే మహేష్ కు ఇలా కంటిన్యూగా షూటింగ్ లు చేయటం ఇష్టం లేకపోయినా పోటీకి తప్పక చేస్తున్నాడట. మరో ప్రక్క అభిమానులు కూడా ఎట్టిపరిస్ధితుల్లోనూ తమ సినిమా ఆడాల్సిందే అని మహేష్ ని కలిసి చెప్తున్నారు. రెండూ క్రేజీ ప్రాజెక్టులో కావటంతో గ్యారెంటీగా ఒక్కదానికే పూర్తి గెలుపు వచ్చే అవకాసం ఉంటుందని మహేష్ భావిస్తున్నారు. వరస పరాజయాలతో దూసుకు పోతున్న తానూ ఎట్టి పరిస్ధితుల్లోనూ కామిడీతో చేస్తున్న ఈ యాక్షన్ పై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఎన్నడూ లేని విధంగా తన సినిమా అద్బుతంగా వస్తోందంటూ ట్విట్టర్ లోనూ రాస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం అస్సలు ఎక్కడా ఈ సినిమా మాత్రం మాట్లాడకుండా హైప్ క్రియేట్ చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.