Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వివాదం చెక్ చెప్పటానికేనా మహేష్ బాబు ఈ హఠాత్తు ప్రకటన?
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సంవత్సరం సందర్బంగా 2017లో తను చేయబోయే కొత్త సినిమాలను ప్రకటించాడు.
హైదరాబాద్ : మహేష్ బాబుతో చిత్రం విషయమై దర్శకుడు వంశీ పైడిపల్లి, పివీపి మధ్య విభేధాలు చోటు చేసుకుని హై కోర్టుదాకా వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో మహేష్ బాబు ...సినిమా ఏ నిర్మాత, దర్శకుడుతో చేస్తాడు..దానికి ముగింపు ఏమిటి అన్న చర్చ మొదలైంది.
కానీ మహేష్ బాబు డైరక్ట్ గా ఆ విషయం ఎత్తకుండా...నేను చేయబోయే చిత్రాల దర్శకులు,నిర్మాతలు అంటూ ఓ లిస్ట్ విడుదల చేసారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఈ లిస్ట్ లో వంశీ పైడిపల్లి చిత్రం గురించి కూడా ఉండటం గమనించవచ్చు.
Working wt @sivakoratala/@DVVEnts for #Mahesh24@directorvamshi/#DilRaju/#AshwiniDutt for #Mahesh25#Trivikram/@MythriOfficial for #Mahesh26
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2016
న్యూ ఇయిర్ సందర్బంగా చేసిన ఈ ట్వీట్ ప్రకటనలో ...మొదటి చిత్రం కొరటలా శివతో దానయ్య నిర్మాతగా ఉండనుంది. అలాగే రెండో చిత్రం వంశీ పైడిపల్లితో దిల్ రాజు, అశ్వనీదత్ సినిమా ఉండనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారితో చేసే సినిమా. ఇలా మూడు ప్రాజెక్టులు అఫీషియల్ గా ప్రకటించాడు.
ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ మహేష్ బాబు ప్రాజెక్టులు ట్విట్టర్ ద్వారా ప్రకటించలేదు. ఇలా హఠాత్తుగా ప్రకటన చేయటానికి కారణం..తాను వంశీ పైడిపల్లితోనే ఉన్నానని, అశ్వనీదత్, దిల్ రాజు లకు సినిమా చేయబోతున్నానని చెప్పటానికి అంటున్నారు.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు ప్రముఖ తమిళ దర్శకుడు ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. జనవరి నెలాఖరుకి షూటింగ్ పూర్తి అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా విషయమై మహేష్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు.
Above all looking forward to the release of #Mahesh23! My dream of working with the supercool director @ARMurugadoss has finally come true!
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2016
అలాగే ప్రస్తుతం న్యూ ఇయర్ హాలీడే లో ఉన్న మహేష్ ఈ వారంలో తిరిగొచ్చి జనవరి 7 నుండి మురుగదాస్ తో చేస్తున్న సినిమా యొక్క కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నాడు.
Wishing you a very happy 2017 @ARMurugadoss sir and also to our entire working unit..!!
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2016
ఈ సంవత్సరం తన కెరీర్లో ఎక్సయిటింగా ఉండనుందని మహేష్ సంతోషం వ్యక్తం చేశాడు.
This is easily the most exciting phase in my career :)
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2016
ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ సినిమాతో బిజిగా ఉన్నాడు. ఈ చిత్రం మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఇప్పటికే 40శాతం పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం తర్వాత మహేష్ మళ్లీ దర్శకుడు కొరటాల శివతో జతకట్టనున్నాడు. ఇప్పటికే 'శ్రీమంతుడు' మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కొరటాల. ఇప్పుడు మహేష్ కోసం మరో అద్భుతమైన కథని రెడీ చేశాడట. ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
కొరటాల చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి చిత్రంలో మహేష్ నటించనున్నాడు. వంశీ చిత్రాన్ని కూడా ప్రిబ్రవరి లేదా మార్చిలో మొదలెట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నట్టు సమాచారమ్. మురగదాస్, కొరటాల, వంశీ పైడిపల్లి లతో చేయబోయే సినిమాలని 2017 రిలీజ్ చేసిందుకు ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిగాక, పూరి చిత్రాన్ని కూడా ఇదే యేదాది పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి మహేష్ జెడ్ స్పీడుతో సినిమాలు చేసేందుకు రెడీ అయినట్టు కనబడుతోంది.