Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు ఎఫెక్టుతో అమృతాంజనం అమ్మకాలు రెట్టింపు
ఓ ప్రక్క మహేష్ అభిమానులంతా ఎప్పుడు ఖలేజా రిలీజవుతుందా అని ఎదురుచూస్తుంటే మహేష్..ముందు అమృతాంజనం వాడండంటూ ముందుకొచ్చారు. అమృతాంజన్ రాష్ట్ర మార్కెట్లో తన వాటాను రెట్టింపు చేసుకునే లక్ష్యంతో ప్రిన్స్ మహేష్ బాబును రంగంలోకి దింపింది. రాష్ట్రంలో అమృతాంజన్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసాద్ తెలిపారు. దేశీయంగా స్ట్రాంగ్ బామ్ మార్కెట్లో తమ వాటా 15-20 శాతం ఉంటుందని అయితే ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో స్వల్పస్థాయికే పరిమితం అయినట్లు ఆయన తెలిపారు. కొత్తగా మార్కెట్లోకి విడుదల చేస్తున్న అమృతాంజన్ స్ట్రాంగ్ పెయిన్ బామ్ (వైట్) ద్వారా తమ మార్కెట్ వాటా రెట్టింపు అవుతుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన చెప్పారు. గత ఏడాదిలో రాష్ట్ర మార్కెట్లో 12-15 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధించామని ఈ ఏడాదిలో 20-25 కోట్ల రూపాయల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అంటే మహేష్...ఖలేజా ద్వారా లాభాలు ఎలా ఉన్నా ఈ అమృతాంజనాన్ని బాగా ప్రమోట్ చేసి వారి టర్నోవర్ పెంచాలన్నమాట..గుడ్.