Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారు..డిటేల్స్
మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం ఫైనలైజ్ అయినట్లు ముంబై మిర్రర్ పత్రికలో కథనం ద్వారా తెలుస్తోంది. ప్రిన్స్ (వివేక్ ఒబరాయ్) చిత్రంతో పరచయమైన కుకి గులాటి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. కుకి ప్రస్తుతం శ్రీమతి షిండేతో కలసి తిచా బాప్...త్యాచా బాప్ అనే చిత్రం రూపొందిస్తున్నాడు. ఆ చిత్రం అనంతరం చేయబోయే చిత్రం మహేష్ బాబుది అని రాసుకొచ్చింది ఆ పత్రిక. అలాగే సోబో ఫిల్మ్స్ వారు ఆ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిపింది. ఇక కుకి,మహేష్ బాబు ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో కొద్ది నెలల క్రితమే పరిచయమయ్యారు. అప్పుడు కుకి చెప్పిన ఓ ధ్రిల్లర్ లైన్ విపరీతంగా మహేష్ కు నచ్చటంతో స్క్రిప్టు చేసుకుని కలవమని చెప్పాడని సమాచారం.
మొన్న దూకుడు షూటింగ్ సమయంలోనూ ముంబైలో కుకి వచ్చి మహేష్ తో చర్చించి వెళ్లాడని సమాచారం. ఇక ఈ విషయమై కుకి గులాటిని మీడియావారు అడగగా...ఇప్పటివరకూ ఏది ఫైనల్ కాలేదు...ఇంకా ఆ ప్రాజెక్టు ప్రారంభ స్టేజిలో ఉంది.ఇప్పుడు నేను మాట్లాడితే బాగోదు. నేను చేస్తున్న మరాఠి చిత్రం పూర్తయ్యేదాకా మరో సినిమాగురించి మాట్లాడలేను అన్నారు. ఇక మహేష్ చేసిన దూకుడు చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ చేయబోతున్నారు. ఆ చిత్రం కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియోట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.