Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడంటే...: మహేష్ బాబు
హైదరాబాద్ : సెన్సేషన్ సినిమాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే సినీ ప్రేమికుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇక మహేష్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు అవధులు దాటి పోవడం ఖాయం. ఇది త్వరలోనే జరిగే అవకాశముందని మహేష్ బాబు చెప్తున్నారు. ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్లో మహేష్ మీడియాతో ముచ్చటించారు.
మహేష్ మాట్లాడుతూ ''శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తా. అవి పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కథ గురించి ఇదివరకే మాట్లాడుకొన్నాము''అని తెలిపారు.
అలాగే ... సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి చెబుతూ ''సహజత్వంతో కూడిన కథ ఇది. యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్ ఇదివరకు చేసిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
ఇక ''విశ్వరూపం' వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. కమల్హాసన్కి నేను వీరాభిమానిని. అంత పెద్ద నటుడు కంటతడి పెట్టడం చాలా బాధనిపించింది''అన్నారు మహేష్బాబు. ఆయన మాట్లాడుతూ ''కమల్హాసన్ నటించిన 'విశ్వరూపం' చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. ఆ సినిమాకి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకొంటున్నాను''అన్నారు.