Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘1-నేనొక్కడినే’ ఆఫీస్ ముందు మహేష్ ఫ్యాన్స్ ధర్నా!
హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో '1-నేనొక్కడినే' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే '1-నేనొక్కడినే' ఆఫీసు ముందు మహేష్ బాబు అభిమానులు ధర్నాకు దిగడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.
కోటి అనే వ్యక్తి తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అభిమానులు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల మహేష్ బాబును కలిసేందుకు అభిమానులు వచ్చినపుడు కోటి కలవకుండా అడ్డుకున్నారని, అభిమానుల పట్ల కోటి అనుచితంగా ప్రవర్తించిన తీరు మహేష్ బాబు దృష్టికి తేవాలనే ఉద్దేశ్యంతోనే వారు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం అవుతోంది.
అయితే ఈ కోటి అనే వ్యక్తి ఎవరు? అనేది కచ్చితమైన సమాచారం లేదు. ఇతను '1-నేనొక్కడినే' సినిమా ప్రొడ్యూసింగ్ విభాగంలో ఒకరని అంటున్నారు. ఏది ఏమైనా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే అభిమానులను ఇలా అవమానించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సాధారణంగా మహేష్ బాబు తన అభిమానులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమా షూటింగ్ వద్దకు ఎవరైనా అభిమానులు వస్తే వాళ్లను తప్పకుండా కలుస్తారు. వారితో మాట్లాడటం, వారితో కలిసి ఫోటోలు దిగడం చేస్తుంటారు. అభిమానులు కూడా అంతకు మించి ఏమీ కోరుకోరు. అయితే కోటి అనే వ్యక్తి తమను అడ్డుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.